– అత్యల్ప రేటుకు ఆర్థిక సంవత్సరపు వృద్ధి
– 2019లో ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందగమనం : ఐఎంఎఫ్ చీఫ్
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమన ప్రభావం భారత్వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలపై ఈ ఏడాది ‘మరింత స్పష్టంగా కనిపిస్తుంది’ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా అన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ‘అత్యల్ప రేటుకు’ పడిపోతుందని జార్జివా అభిప్రా యపడ్డారు. ప్రపంచంలో దాదాపు 90శాతం మందిపై ఆర్థిక మందగమన ప్రభావం పడుతుందని అన్నారు. ‘రెండేండ్ల కిందట .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమకాలీకరించబడిన పురోగతిలో ఉన్నది. జీడీపీతో పోల్చిచూస్తే దాదాపు 75శాతం వేగవంతంగా వున్నది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మందగమనంలో ఉన్నది. 2019లో దాదాపు 90 శాతం మందగమనం ఉంటుందని భావిస్తున్నాం’ అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎన్నికైన జార్జివా తన తొలి ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ‘అమెరికా, జర్మనీల్లో నిరుద్యో గం కనిష్ట స్థాయిలో ఉన్నది. అయినప్పటికీ.. అమెరికా, జపా న్, ముఖ్యంగా యూరో ప్రాంతంతో సహా అభివృద్ధిచెందిన దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు మృదువుగా సాగుతున్నాయి. భారత్ సహా కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఈ ఏడాది మరింత స్పష్టంగా కనిపి స్తున్నది’ అని ఆమె చెప్పారు. ప్రపంచ వాణిజ్యవృద్ధి ‘నిలిచిపోయే స్థితికి చేరుకున్నదని అభిప్రాయపడ్డారు. బహుళ దేశాల మధ్య క్లిష్టమైన సమస్యలుగా కరెన్సీల వివాదాలు ముందుకొచ్చా యన్నారు. దేశాల మధ్య సుంకాలు, ప్రతి సుంకాలపై పెరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. అన్ని దేశాలూ కలిసి పనిచేయాలని ఐఎంఎఫ్ చీఫ్ పిలుపునిచ్చారు.
Courtesy NavaTelangana..