- తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఇస్తారా?..
- స్టూడియోల పేరుతో భూముల ఆక్రమణ ఊరుకోం
- దర్శకుడు శంకర్కు భూ కేటాయింపుపై హైకోర్టు ప్రశ్నలు
హైదరాబాద్, ఆగస్టు 27: కోట్ల రూపాయలు విలువ చేసే భూములను నామమాత్ర రేటుకే ఎలా కట్టబెడతారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్ర శ్నించింది. సినీ దర్శకుడు ఎన్. శంకర్కు ఎకరం రూ. 5లక్షల చొప్పున ఐదు ఎకరాల భూమిని కేటాయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఎకరం 2.5 కోట్లు వి లువచేసే భూమిని రూ.5లక్షలకే కేటాయించడంలో సహేతుకత ఏమిటని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ బదులుచెపుతూ…దర్శకుడు శంకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏజీ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం… ‘‘తెలంగాణ కోసం 10 వేల మందికి పైగా తీవ్రంగా పోరాడారు. ఆ విషయానికి వస్తే రాష్ట్ర ప్రజలంతా ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఎకరం రూ.2కే కేటాయిస్తారా?’’ అని నిలదీసింది. ‘‘రూ. 2.5 కోట్ల విలువ చేసే భూమి రూ.2 కోట్లకు కేటాయించారంటే అర్థం ఉంది. కేవలం రూ.5 లక్షలకే ఎలా కేటాయించారు’’ అ ని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రపంచస్థాయి స్టూడియో నిర్మించడం కోసం ప్రభుత్వం ఈ భూమి కేటాయించిందని ఏజీ వివరించారు. దర్శకుడు శంకర్కు భూముల కేటాయింపునకుఫిలిం డెవల్పమెంట్ కార్పొరేషన్ సిఫారసు చేసిందని ఆయన తెలిపారు. ‘‘ఇప్పటికే హైదరాబాద్ నగరంలో సినీ పరిశ్రమ నిలదొక్కుకుంది. రామోజీ ఫిలిం సిటీ దేశానికే తలమానికంగా ఉంది. అన్ని సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నవాటిని ప్రో త్సహించాల్సిఉండగా కొత్తగా స్టూడియోలు ఎందుకు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ మాటకు వస్తే ప్రైవే టు వ్యక్తులకు భూములు ఎందుకు కేటాయించాలని అడిగింది. అదేదో ప్రభుత్వమే చేస్తే ప్రభుత్వానికి ఆదా యం వస్తుందని వ్యాఖ్యానించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే ఉన్నప్పుడు రాష్ట్రంలో ఫిల్మ్ స్టూడియోలను ప్రభుత్వమే నిర్మించిందని పేర్కొంది.
అలా అయితే, చిన్న నిర్మాతలు, డాక్యుమెంటరీలు, వైల్డ్ లైఫ్ చిత్రీకరణ చేసే వారికీ భూములు కేటాయిస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. స్టూడియోల పేరుతో ప్ర భుత్వ భూములు ఆక్రమించుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో సెప్టెంబరు 15లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆదేశా లు జారీచేసింది. శంకర్కు ఎకరం రూ.5లక్షలకే కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కరీంనగర్కు చెందిన నిరుద్యోగి జె. శంకర్ పిల్ దాఖలు చేశారు.
Courtesy Andhrajyothi