YSR జగనన్న గ్రీన్ వీలేజ్ లో ప్రజలకు కావలసిన అన్ని మౌళిక సదుపాయాలు సమకూర్చడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.ఈ ఉదయం కైకలూరు లోని ఏలూరు రోడ్ లోని వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ కాలనీలో
ఇంటి నిర్మాణాలకు మంచినీటి ఇబ్బందులు ఉండకూడదు అని, RWS అధికారులతో ప్రత్యేక అంచనాలు తయారు చేయించి, ఈ రోజు 75లక్షలు రూపాయలు ఆన్ లైన్ టెండర్ ద్వారా, ప్రముఖ కాంట్రాక్టర్ లంక వెంకటేశ్వరరావు ఈ యొక్క మంచినీటి పైపు లైన్ పనులకు ఈ రోజు పైపులు YSR జగనన్న గ్రీన్ వీలేజ్ లో దింపటం జరిగింది అని అన్నారు. ఈ YSR జగనన్న గ్రీన్ వీలేజ్ లో, ఇంటి నిర్మాణం చేసుకొనే అక్కచెల్లమ్మలకు కైకలూరు పట్టణంలోని OHSR నుంచి నీటిని పైపు లైన్ ద్వారా విడుదల చేస్తారు అని అన్నారు, అదేవిదంగా YSR జగనన్న గ్రీన్ వీలేజ్ లో త్వరలోనే కరెంట్ సబ్ స్టేషన్ నిర్మాణం, అండర్ లైన్ కరెంట్, 18 కిలోమీటర్లు పైబడి C. C. రోడ్డులు, పక్కా డ్రైనేజీ పనులు, రెండు OHSR లు, అదేవిదంగా 5 ఎకరాలలో డంపింగ్ యార్డ్, 10 ఎకరాలలో అన్ని మతాల స్మశాన వాటిక,15 ఎకరాల మంచినీటి చెరువు, సచివాలయం, RBK, మిల్క్ ప్రాజెక్టు, వెల్నెస్ సెంటర్ ఇప్పటికే నిర్మాణాలు ప్రారభించారు అని అన్నారు, మొదటి విడతలో వచ్చిన అక్కచెల్లమ్మలకు త్వరగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అన్నారు, అదేవిదంగా ఇంకా అర్హులు ఎవరు వున్న కూడా, అర్జీ పెట్టుకున్న 90 రోజులలో ఇంటి స్థలాలు ఇస్తాం అని అన్నారు, ఈ కార్యక్రమంలో RWS DEE. శాస్త్రి, RWS AEE. నాగబాబు, EO లక్ష్మినారాయణ, పడమటపాలెం సర్పంచ్ సాన మీనా సరస్వతి, దానం ప్రసాద్, సాన వెంకటరామారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.