దేశంలోనే తొలి డ్రైవర్ వీరలక్ష్మి
చెన్నై, సెప్టెంబరు 1 : వీరలక్ష్మి….దేశంలోనే తొలిమహిళ అంబులెన్స్ డ్రైవర్గా నియమితురాలైంది. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా బోడినాయకనూర్కు చెందిన వీరలక్ష్మి (30) వివాహమైన తరువాత భర్తతో కలసి చెన్నైకి చేరుకుంది. భర్త కారు డ్రైవర్గా ఉండడంతో ఆయన సహకారంతో డ్రైవింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత కుటుంబపోషణ కోసం మూడేళ్లపాటు చెన్నైలో కారు డ్రైవర్గా పనిచేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం కరోనా బాధితుల కోసం ముఖ్యమంత్రి ఎడప్పాడి ప్రారంభించిన కొత్త అంబులెన్స్లలో ఒకదాని డ్రైవర్గా వీరలక్ష్మి నియమాక ఉత్తర్వులు అందుకుంది.
అంబులెన్స్ డ్రైవర్లుగా పురుషులు ఉన్న తరుణంలో తాను నియామకం కావడం ఆనందంగా ఉందని వీరలక్ష్మి ఈ సందర్భంగా అన్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆస్పత్రులకు చేర్చే ఈ కొత్త సేవ బాగా నచ్చిందని తెలిపింది.