లఖనువా, సెప్టెంబరు 14: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎ్సఎఫ్) తరహాలో ప్రత్యేక భద్రతా దళం ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ట్విటర్లో పేర్కొంది.
కొత్తగా ఏర్పాటు చేసే ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం(యూపీఎ్సఎ్సఎఫ్) అనుమానితులను ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్, విచారణ చేయగలదు. యూపీ ప్రభుత్వం ట్విటర్లో పేర్కొన్న ప్రకారం రూ.1,745.06 కోట్ల వ్యయంతో మొదట 8 బెటాలియన్స్తో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ అదనపు ముఖ్యకార్యదర్శి(హోం) అవనిశ్ అవస్థి తెలిపారు.