- 24 మందికి 100 పర్సంటైల్
- 8 మందితో తెలంగాణ టాప్
- నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్
- ఏపీ నుంచి ముగ్గురు టాపర్లు
- బాలికల్లో ఒకే ఒక్కరికి 100ు
- ఆ ఒక్కరూ తెలంగాణ బిడ్డే
- ‘అడ్వాన్స్డ్’లో మనవాళ్ల సత్తా
హైదరాబాద్, అమరావతి : ఐఐటీలు, ఎన్ఐటీలు, సీఎ్ఫటీఐలలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ-మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో రెండు సార్లు వాయిదా పడ్డ ఈ పరీక్షలను ఈ ఏడాది జనవరిలో, ఈ నెల 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.
జనవరిలో 9.21 లక్షల మంది పరీక్షలు రాశారు. తాజాగా నిర్వహించిన పరీక్షల కోసం మొత్తం 8.58 లక్షల మంది నమోదు చేసుకోగా.. 6.3 లక్షల(74ు) మంది హాజరయ్యారు. 24 మంది 100 పర్సంటైల్ సాధించారు.
అత్యధికంగా 100ు స్కోరు సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ టాపర్గా నిలిచింది. చాగరి కౌషల్ కుమార్ రెడ్డి, దీటి యేషాష్ చంద్ర, చుక్కా తనూజ, మోరెడ్డిగారి లిఖిత్రెడ్డి, రాచపల్లె శశాంక్ అనిరుధ్, రోంగల అరుణ్ సిద్ధార్థ, శివకృష్ణ సాగి, వాడపల్లి అర్వింద్ నర్సింహ తెలంగాణ నుంచి వంద శాతం స్కోరు సాధించిన వారిలో ఉన్నారు. ముగ్గురు టాపర్లతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన జితేంద్ర(విజయనగరం), తడవర్తి విష్ణు సాయి శంకర్ (బాపట్ల), నరసింహనాయుడు ఈ ఘనతను సాధించారు. మిగతా టాపర్లలో ఐదుగురు ఢిల్లీ, నలుగురు రాజస్థాన్, ఒకరు గుజరాత్, మరొకరు మహారాష్ట్రకు చెందిన వారున్నారు. టాప్స్కోరర్లలో బాలుర (23 మంది) హవా కొనసాగింది.
100 పర్సంటైల్ సాధించిన వారిలో ఒకే ఒక్క బాలిక ఉండగా.. ఆమె తెలంగాణ బిడ్డ కావడం గమనార్హం. మిగతా ర్యాంకుల్లోనూ తెలుగు తేజాలు మెరిశారు. జేఈఈ అడ్వాన్స్డ్కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా.. వారిలో తెలుగువారు 12 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్సైట్లో తమ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది.
Courtesy Andhrajyothi