మళ్ళీ తెలంగాణా లో విద్యార్థులు రోడ్డున పడ్డారు. గత దశాబ్దాలుగా ఎదో ఒక అంశం పై పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ కనీసం పొట్ట కూటికి కూడా ఎటువంటి భరోసా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు . ఈ విద్యార్థులు ఎర్రటి ఎండలో తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ళు ఆస్తులు , పాస్తులు అడగట్లేదు. కనీసం విద్యని అయినా ఇవ్వండి, నాణ్యమైన విద్యని ఇయ్యండి అని అడుగుతున్నారు. విద్య లేకుండా ఏ సమాజం , దేశం అభివృద్ధి చెందలేదు కానీ ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని బిచ్చగాళ్ళని చేసే పధకాలు చేపడుతూ దేశాన్ని మానవ అభివృద్ధికి పనికి వచ్చే వికాసానికి దూరం చేస్తున్నారు. ఈ పోరాటం లో మనందరం పాలు పంచుకుందాం .
https://www.andhrajyothy.com/artical?SID=775079