హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసి సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే. దీంతో వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం కూడా నిలిచిపోయింది. మరోవైపు కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు డ్రైవర్లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఫైల్ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.
Courtesy Andhrajyothi…