By Gurram Sirtaramulu
నల్గొండ జిల్లా వలిగొండ నుండి కొలిమి భుజాన వేసుకొని మా ఊరు వచ్చారు సీలోజు రాఘవాచారి తాత నర్సయ్య గారు. మూడో తరం ఇది . ఊదీ ఊదీ ఊపిరితత్తు చిల్లులుబడింది.ఆరెకరాల ఆసామి ఆరెకరం వ్యవసాయ కూలీ అయ్యాడు. ఆయన చేసిన నాగళ్ళు , దంతెలు,గొర్రు, నగీషీ తో జిగేల్ మనే తంగేడు శావ జగిడెం, తలుపులు దర్వాజలు, మంచాలు ముక్కాలు పీటలు, బండ్లు చక్రాలకు పట్టాలు, ఒకటా రెండా ఆయన చేతి మహత్తు మా ఊరి భూమంతా గుల్ల గుల్ల చేసి కోట్ల పుట్లు పండించింది, చివరికి కోటి గింజలు కూడా మిగలలేదు. వడ్రంగి పని చేసి కుమ్మరి పనిలో చింపిరి తిత్తితో కుస్తీలు పడుతుండు వృత్తులు కూలినయి ఉపాధి పోయింది , ఆధునిక కొలిమి కర్ర యంత్రాలు మా చారి గారి చేతికి సంకెళ్లు వేసాయి. అయినా ఆయన తన తిత్తులు ఎగబోస్తూ కొలిమిని చింత నిప్పుల్లా మండిస్తూనే ఉన్నాడు. సాధించుకున్న రాష్ట్రాలు స్వీయ పాలన మా రాఘవాచారి తల రాత అన్నా మారుస్తాయా ? అనే మీమాంస నాది. ఆయన కళ్ళ లోతుల్లో కనుపాపలు పడుతున్న తపన ఏ భాష రాయగలదు, ఏ శాస్త్రం చేయూత నియ్యగలదు ? ఏ నేల విముక్తిని ప్రసాదించగలదు.? రాఘవాచారి నిత్యం పారాయణం చేసే ఇండియన్ నోస్ట్రడామస్ వీరబ్రహ్మం %