అధ్యక్షునిగా అభిషేక్నందన్ రికార్డు
– 1146 ఓట్ల మెజార్టీతో గెలుపు.. అన్ని పోస్టుల్లోనూ జయకేతనం
– మార్మోగిన లాల్సలాం నినాద
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో ఎస్ఎఫ్ఐ జెండా రెపరెపలాడింది. హెచ్సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి ఘనవిజయం సాధించింది. అన్ని పోస్టుల్లోనూ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు నుంచి ఎస్ఎఫ్ఐ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అన్ని పోస్టులకూ ఈ కూటమి కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మతోన్మాద ఏబీవీపీని విద్యార్థులు మట్టికరిపించారు. హెచ్సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి అభిషేక్నందన్ రికార్డు నమోదు చేశారు. ఏబీవీపీ కూటమి నుంచి అధ్యక్షునిగా పోటీ చేసిన ఫణికృష్ణపై 1,146 ఓట్ల మెజార్టీతో అభిషేక్నందన్ గెలిచారు. అధ్యక్ష స్థానానికి మొత్తం 4,221 ఓట్లు పోలయ్యాయి. ఇందులో అభిషేక్నందన్కు 2,205 (52.24 శాతం) ఓట్లు, ఫణికృష్ణకు 1,095 ఓట్లు, మహమ్మద్ షమీమ్కు 382 ఓట్లు, జయశ్రీకి 232 ఓట్లు, కె రామరాజుకు 105 ఓట్లు వచ్చాయి. నోటాకు 167 మంది ఓటు వేయగా, 35 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. తొలుత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్ఎఫ్ఐ-ఏఎస్ఏ-డీఎస్యూ-టీఎస్ ఎఫ్ కూటమి అధ్యక్ష అభ్యర్థి అభిషేక్నందన్ ఘనవిజయం సాధించడంతో హెచ్సీయూలో సంబురాలు అంబరాన్నం టాయి. విద్యార్థులు జైభీం లాల్సలాం, ఎస్ఎఫ్ఐ జిందాబా ద్ నినాదాలు చేయడంతో విశ్వవిద్యాలయం మార్మోగిపో యింది. విశ్వవిద్యాలయంలో ప్రదర్శన నిర్వహించి విజయకేతనాన్ని ఎగురవేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి హెచ్సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్ఎఫ్ఐ-ఏఎస్ఏ- డీఏస్యూ-టీఎస్ఎఫ్ కూటమి నుంచి ఉపాధ్యక్షునిగా పోటీ చేసిన శ్రీచరణ్ 1,843 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన గోపిస్వామి 2,039 ఓట్లు, సంయుక్త కార్యదర్శిగా బరిలో నిలిచిన రాథోడ్ ప్రదీప్ 2,040 ఓట్లు, సాంస్కృతిక కార్యదర్శిగా పోటీచేసిన ప్రియాంక 1,898 ఓట్లు, క్రీడల కార్యదర్శిగా సోహైల్ అహ్మద్ 1,776 పొంది విజయం సాధించారు. జెండర్ సెన్సిటైజేషన్ కమిటీలో ఉన్న మూడు పోస్టులనూ ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థులు గెలుపొందారు.
వర్సిటీల్లో ఏబీవీపీకి ఎదురుగాలి
దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఏబీవీపీకి ఎదురుగాలి వీస్తున్నది. మతోన్మాద భావజాలం, హిందూత్వ ఆలోచనలను విద్యార్థులు తిరస్కరిస్తున్నారు. ఇటీవల విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీని విద్యార్థులు ఓడించడమే ఇందుకు నిదర్శనం. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు ఘన విజయం సాధించాయి. ఢిల్లీలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లోనూ ఎస్ఎఫ్ఐ కూటమి విజయదుందుభి మోగించింది. కేరళలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, కాలేజీల్లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ క్లీన్స్వీప్ చేసింది. అన్ని పోస్టుల్లోనూ గెలిచి సత్తాచాటింది. పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ కూటమి అభ్య ర్థులు విజయం సాధించారు. ఇలా దేశంలో ఏ విశ్వవి ద్యాలయంలో ఎన్నికలు జరిగినా ఏబీవీపీకి పరాభవం ఎదు రవుతున్నది. వామపక్ష విద్యార్థి సంఘా లను విద్యార్థులు బలపరుస్తున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు బలం : ఎస్ఎఫ్ఐ
హెచ్సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి అన్ని పోస్టుల్లోనూ ఘనవిజయం సాధించడం పట్ల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ హర్షం ప్రకటించింది. ఈ విజయం ప్రజాస్వామ్య పరిరక్షణకు బలం చేకూర్చిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎస్ మూర్తి, టి నాగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో మతోన్మాదాన్ని, ఆర్ఎస్ఎస్ ఎజెండాను విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలని చూసే వారికి ఈ విజయం చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు, విశ్వవిద్యాలయాల్లో భావప్రకటనా స్వేచ్ఛకు ఈ విజయం దోహదపడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకుండా విద్యార్థులు ఉద్యమించాలని పేర్కొన్నారు. హెచ్సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం సాధించడం పట్ల డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం విప్లవ్కుమార్, ఎ విజరుకుమార్, టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి పగడాల లక్ష్మయ్య హర్షం ప్రకటించారు.
ఏబీవీపీని తిరస్కరించారు : అభిషేక్నందన్, హెచ్సీయూఎస్యూ అధ్యక్షులు
హెచ్సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో విద్యార్థులు ఏబీవీపీని తిరస్కరించారు. కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడిచే బీజేపీ ప్రభుత్వం దళితులు, ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. పేద ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నది. ఇంకోవైపు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించకుండా, నిధులు కేటాయించకుండా మతోన్మాద భావజాలంతో మభ్యపెడుతున్నది. స్వచ్ఛభారత్ తరహాలో ఏబీవీపీని ఓడించి విద్యార్థులు తీర్పునిచ్చారు.
హెచ్సీయూ విద్యార్థి సంఘం
ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థుల ఓట్లు
పోస్టు అభ్యర్థి ఓట్లు
అధ్యక్షులు అభిషేక్నందన్ 2,205
ఉపాధ్యక్షులు శ్రీచరణ్ 1,843
ప్రధాన కార్యదర్శి గోపిస్వామి 2,039
సంయుక్త కార్యదర్శి రాథోడ్ ప్రదీప్ 2,040
సాంస్కృతిక కార్యదర్శి ప్రియాంక 1,898
క్రీడల కార్యదర్శి సోహైల్ అహ్మద్ 1,776
హెచ్సీయూ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నిక వివరాలు
పేరు ఓట్లు
అభిషేక్నందన్ 2205
ఫణికృష్ణ 1095
మహమ్మద్ షమీమ్ 382
జయశ్రీ 232
కె రామరాజు 105
నోటా 167
చెల్లనివి 35
మొత్తం 4,221
Courtesy Navatelangana…