తెలంగాణ వస్తే ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని కేసీఆర్ గతంలో వాగ్దానం చేశారు. ఈ హామీ నెరవేరలేదు. రాష్ట్రంలోని దళితులకు భూమి ఇస్తామన్నారు. అది దాదాపు అమలులోనికి నోచుకోలేదు. రాష్ట్రంలో తరచూ దళితుల మీద హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం కూడా కరువైపోయింది. మ్యాన్హోల్స్ లో దిగి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న సఫాయి కర్మచారి కార్మికులు తరచూ తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇటువంటి సంఘటనలు 2000 సంవత్సరం నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 27 తెలంగాణలో 21 జరిగాయి. వీరందరి వివరాలను సఫాయి కర్మచారి ఆందోళన నమోదు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈ విధంగా మరణించిన సఫాయి కర్మచారి కార్మికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉన్నది. అయితే మరణించిన వారందరికీ పరిహారం అందడం లేదు. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై శివరాజ్ బోర్డు ఉద్యోగులు ఈ సంస్థ కింద పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకే ఈ పరిహారం దక్కుతుందని ప్రభుత్వం చెబుతున్నది. ప్రైవేటు కాంట్రాక్టర్లు నియమించుకున్న వారికి ఈ హక్కు లేదని ప్రభుత్వం బుక్కా ఇస్తున్నది. ఉదాహరణకు తన భర్త 2013 లో చనిపోతే జిహెచ్ఎంసి లక్ష రూపాయలు కాంట్రాక్టర్ 200000 ఇచ్చారని తనకు పారిశుధ్యకార్మికురాలిగా పని ఇచ్చారని ఒక బాధిత మహిళ టైమ్స్ ఆఫ్ ఇండియాతో వాపోయింది. తమకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా రాలేదని శ్రీలత అనే ఈ మహిళ పేర్కొంది. అయితే జీహెచ్ఎంసీ మాత్రం తాము చట్ట ప్రకారం పరిహారం ఇస్తున్నామని ఈమె భర్త ప్రైవేటు కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరి ఉండినందున రూ.పది లక్షలు పొందే హక్కు లేదని జిహెచ్ఎంసి అధికారులు వివరణ ఇచ్చుకున్నారు.2000 సంవత్సరం నుంచి దేశంలో ఒక వెయ్యి ఇరవై మంది సఫాయి కర్మచారి కార్మికులు మ్యాన్ హోల్ లో పడి దుర్మరణం చెందారు అని సఫాయి కర్మచారి ఆందోళన నాయకుడు బెజవాడ విల్సన్ చెప్పారు. సమాజం కోసం, పారిశుద్ధ్యం కోసం ప్రజారోగ్యం కోసం, దుర్భర పరిస్థితుల్లో ప్రమాద పరిస్థితులలో పని చేస్తున్న సఫాయి కార్మికులకు న్యాయం జరపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఇటీవల కాలంలో మ్యాన్హోల్స్. క్లీనింగ్ కోసం ఆధునిక యంత్రాలు సైతం వచ్చాయి. ఇటువంటి యంత్రాలను కార్మికుల చేత నిర్వహింపచేస్తూ ప్రమాదాలను నివారించవచ్చు. అయితే అందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి అవసరం.