కంచరపాలెం: బొట్టా నర్సింగరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై బిఎన్ఆర్ భవన్లో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కి ఫౌండేషన్ కన్వీనర్ వి.అప్పలరాజు అధ్యక్షత వహించగా ఎయు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్, ఫోరమ్ ఫర్ దళిత స్టడీస్ డైరెక్టర్ ఆచార్య పి.అరుణ్కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని మోఢ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2019 -20 సంపన్ను.. సామాన్యులకు భారాలే వేసే విధంగా ఉందన్నారు. వ్యవసాయ వృద్ధిరేటు 2.1 శాతం పెంచలేదు. ఆర్థిక వేత్తలు 14.80 శాతం వ్యవసాయ వృద్ధి ఉండాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రైతులు 36 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. పారిశ్రామిక రంగం దేశ అభివృద్ధికి దోహదపడే కీలక రంగమన్నారు. పారిశ్రామిక, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే, విద్యుత్, రక్షణ, ఆయక వంటి అత్యంత కీలకమైన రంగాలను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. అనంతరం సిఐటియు నగర కార్యదర్శి జగన్ మాట్లాడుతూ కార్మిక హక్కులు పోరాడి సాధించుకున్నవని, ఇటువంటి చట్టాలను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి ఆకర్షణీయమైన మాటలు చెప్పినా ఉపాధి కల్పనలో తీవ్రంగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎస్.సోమేశ్వరరావు, పి.పద్మ, ఈశ్వరమ్మ, సింహాచలం, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Courtesy Nava telangana…