నియోజకవర్గం ప్రజల ఆశీస్సులుతో గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ఆదేశాలతో కైకలూరు నియోజకవర్గంలో 4గురు జడ్పీటీసీలను 67 ఎంపీటీసీలను గెలుపొందటం చాలా సంతోషం అని MLA DNR గారు అన్నారు. ఈ ఉదయం కైకలూరు నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల జడ్పీటీసీలకు నియోజకవర్గంలోని 67 మంది ఎంపీటీసీలకు అభినందన సభ నిర్వహించారు. ఈ అభినందన సభలో MLA DNR గారు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ YS రాజశేఖరరెడ్డి గారి దివ్య ఆశీస్సులుతో గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న నాయకత్వంలో మీరు అందరు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం మీ అందరి అదృష్టం అని మీతో పాటు నేను ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం అని MLA గారు అన్నారు. కైకలూరు నియోజకవర్గం నుంచి నూతనంగా ఎంపిక అయిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తరుపున గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ప్రజాసంకల్పపాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసి, విని, మనం అధికారంలోకి రాగానే నవరత్నాల పధకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎక్కడ అవినీతికి తావులేకుండా ప్రతి సంక్షేమ పధకాన్ని వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు అని అన్నారు. అదేవిదంగా గ్రామ స్థాయిలో పరిపాలన నేరుగా అందించడానికి, వాలంటరీల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ స్థాపించి ప్రతి 50 ఇండ్లకు పరిపాలన అందిస్తున్నారు అని అన్నారు. ముఖ్యంగా ప్రతి ప్రజాప్రతినిది క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు, మనం అందరం కేవలం YSRCP పార్టీ అధ్యక్షులు YS జగనన్న ఆశీస్సులుతో గెలిచాం అని, ప్రజలకు ఆయన పైన వున్న నమ్మకం మీరు అందరు బాధ్యతగా పని చేసి, అనునిత్యం ప్రజల సమస్యలు పరిష్కారం చూపాలని అన్నారు. కైకలూరు నియోజకవర్గ చరిత్రలో ఇంత వరకు ఎవరు ఎప్పుడు చూడని, వినని విధంగా 90 శాతం పైబడి ప్రజలు మనకి విజయం అందించారు అని అన్నారు, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోసింగ్ కార్పొరేషన్ డైరక్టర్ గంటా సంధ్య, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరక్టర్ నంబూరి శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యులు కురేళ్ళ బేబీ, ముంగర విజయనిర్మల, ఈడే వెంకటేశ్వరమ్మ, బొర్రా సత్యవతి, మండల నాయకులు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, అడవి కృష్ణ, చందన ఉమామహేశ్వరరావు, రామిశెట్టి సత్యనారాయణ, మండల అధ్యక్షులు నీలపాల వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, AMC వైస్ చైర్మన్లు బొర్రా శేషుబాబు, షేక్ రఫీ, నియోజకవర్గంలోని 67 మంది ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.