కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద ముదినేపల్లి మండలంలోని V. రావిగుంట గ్రామ సర్పంచ్ గా గెలిచిన అర్జా రామజోగేశ్వరావు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ V. రావిగుంట గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే V. రావిగుంట గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బొర్రా శేషుబాబు, దాసరి శ్రీను, పాలడుగు వెంకటేశ్వరరావు, దాసరి శేషరత్నం, వెంకటేశ్వమ్మ, రాజగోపాల్, ఫణింద్ర యువకులు తదితరులు పాల్గొన్నారు.