కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని పుట్లచెరువు గ్రామ సర్పంచ్ గా గెలిచిన గురుగుబెల్లి వెంకటేశ్వరరావు (వెంకన్న) గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ,పుట్లచెరువు గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే పుట్లచెరువు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో,వడ్లాని నరసింహరావు, ఆళ్ల సూర్యనారాయణ, మెండ వెంకయ్య, దేవేళ్లారరావు, కూన శ్రీనివాస్, నరసింహరావు యువకులు తదితరులు పాల్గొన్నారు.