– కరోనాపై డబ్ల్యూహెచ్వో కీలక వ్యాఖ్యలు
– మరిన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటూ హెచ్చరికలు
– ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి
జెనీవా: కరోనా వైరస్ ప్రభావంతో యావత్ ప్రపంచం గజగజ వణికిపోతు న్నది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి అన్ని దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కీలక వ్యాఖ్య లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు తీసుకుంటున్న కరోనా మహమ్మారే చివరిది కాదని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ హెచ్చరించారు. అలాగే, ”వైరస్ ఉత్పాతాలు, మహమ్మారి విజృంభణలు నిజజీ వితంలో తప్పవని చరిత్ర స్పష్టం చేస్తోంది. మున్ముందు రాబోయే మహమ్మా రిలను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత సంసిద్ధంగా ఉండాలి. ఇందులో భాగంగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు భారీగా ఖర్చుచేయాల్సిన అవసర ముంద’ని అన్నారు. అలాగే, కేవలం ఏ ఒక్కదేశమో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టినంత మాత్రాన మహమ్మారిని అరికట్టలేమని డబ్ల్యూహెచ్వో అభిప్రాయపడింది. దేశాలన్నీ అనుసంధానమై ఉన్న ప్రపంచంలో, స్వల్ప ఆదాయ దేశాల ప్రజలకు వ్యాక్సిన్ అందకపోతే అది మరింత విస్తరించే ప్రమాదం ఉంటుందని తేల్చిచెప్పింది. అందుకే, ప్రతిదేశానికీ వ్యాక్సిన్ అందించడం ఎంతో కీలకమని అభిప్రాయపడింది.కాగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ అన్ని దేశాల్లో కలిపి 2,75,24,060 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 8,97,629 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అమెరికాలో 64,87,274 పాజిటివ్ కేసులు నమోదుతోపాటు 1,93,589 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్లో 41,47,794 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 1,27,001 కోవిడ్-19 మరణాలు సంభవించాయి. రష్యా, పెరూ, కొలంబియా దేశాలు వరుసగా నాల్గు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.
Courtesy: NT