- కొవిడ్ నియంత్రణకు క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్లు
- ప్రధాని మోదీ ఖాతాను పునరుద్ధరించామని తెలిపిన ట్విటర్ యాజమాన్యం
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్సైట్కు లింక్ చేసిన ట్విటర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తరువాత హ్యాకర్లు, కొవిడ్-19 నియంత్రణకు ప్రధాని జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వమని కోరుతూ పోస్టింగులు పెట్టారు. ఈ ఖాతాను తానే హ్యాక్ చేసినట్లు జాన్ విక్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ట్విటర్ అధికార ప్రతినిధి ఒక ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మోదీ ఖాతాను పునరుద్ధరించినట్లు, ఆయన ఖాతాను 25 లక్షల మంది అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఇటీవల 130 మంది ప్రముఖుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని హ్యాక్ చేసినట్లు వెల్లడించారు.
Courtesy Andhrajyothi