కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్)
ఆంధ్రప్రదేశ్ కమిటీ
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోముల మండలం బండకిందపల్లి కి చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ మరణం పై సమగ్రంగా పరిశీలన చేసి కారకులైన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఓం ప్రతాప్ కుటుంబానికి నష్టపరిహారం కింద 50 లక్షల రూపాయలు చెల్లించాలని, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనిగా కోరారు.
రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన కులవివక్ష, దాడులు, అవమానాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు, శిరోముండనాలు పెట్రేగిపోతున్నాయి. వీటి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం విఫలమైందన్నారు . ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనలను పరిశీలన చేస్తే అధికార పార్టీ నాయకులు, పోలీసులు ముద్దాయిలుగా ఉన్నారు. కొన్ని చోట్ల పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ అసలు ముద్దాయిలు వైసిపి నాయకులపై కేసులు నమోదు చెయ్యడం లేదు. నమోదు చేసినప్పటికీ అరెస్టు చెయ్యకుండా కొమ్ము కాస్తున్నారు . శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ పిఏ తమ్ముడు మరియు వైసిపి నాయకులపై , తూర్పుగోదావరి జిల్లా సీతానగరం లోని ఇసుక మాఫియా కృష్ణ మూర్తి మరియు అనుచరులపై, చిత్తూరు జిల్లా మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు మరియు వారి అనుచరులపై కేసులు నమోదు చేశారు. కానీ ముద్దాయిలను ఇంతవరకు అరెస్టు చెయ్యలేదు. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వలనే దళితులపై దుర్మార్గమైన దాడులు పెరుగుతున్నాయి తప్పా తగ్గడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరపాలని ముద్దాయిలపై చర్యలపై చర్చించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో తీరిక లేకుండా సమీక్షలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి దళితులపై జరుగుతున్న దుర్మార్గమైన దాడులపై చర్చించేందుకు ఎందుకు చొరవ చూపలేకపోతున్నారు . దళితుల పట్ల వివక్ష చూపుతున్నారు. ఈ దుర్మార్గాన్ని కెవీపియస్ ఖండిస్తుంది. ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరుతున్నాము….
అండ్ర మాల్యాద్రి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవీపియస్ )