కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని పసలపూడి గ్రామ సర్పంచ్ గా గెలిచిన ఉచ్చుల వెంకట కృష్ణారావు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ పసలపూడి గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు, అలాగే పసలపూడి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, ఉచ్చుల సుబ్బారావు, జంగం సామీయేలు, జంగం బుజ్జి, దాసరి రమేష్ యువకులు తదితరులు పాల్గొన్నారు.