కరోనా బారిన పడిన రోగులకు ప్రాణ వాయువును అందించి ప్రాణ దాతలుగా నిలుస్తున్న హెల్ప్ ఇండియా బ్రీత్ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.
ఈరోజు కైకలూరు CHC లోని కోవిడ్ సెంటర్ లో హెల్ప్ ఇండియా బ్రీత్ వారు ఆక్సిజన్ కాన్స్ ట్రేటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్, మరియు మందులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ కోవిడ్ 2 వ దశ ద్వారా విజృంభించి అనేక మందిని పొట్టన పెట్టుకుంటున్న తరుణంలో కైకలూరు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఒక కోవిడ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా జిల్లా మంత్రులు శ్రీ పేర్ని నాని, కొడాలి నాని గార్ల చొరవతో జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో 25 ఆక్సిజన్ పడకల కోవిడ్ ఆస్పత్రిని మనం ప్రారంభించుకోగలిగామని అన్నారు. ముఖ్యంగా డా.వేణుగోపాల్ గారు ఇంచార్జి గా, ఇతర వైద్యులు మరియు సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా రోగులకు ఆక్సిజన్ అందక ఎక్కువ మరణాలు సంభవిస్తున్న స్థితికి చలించి ఎక్కడో USA లో ఉంటున్న 16 సం.ల ఆర్య హెల్ప్ ఇండియా బ్రీత్ సంస్థను ఏర్పాటు చెయ్యడం తన సొంత కుటుంబసభ్యులచే ఇలా తన ప్రాంతం వారికి విపత్కర పరిస్థితుల్లో వెలకట్టలేని సేవలు అందించడం నిజంగా అభినందనీయం అన్నారు. లివ్ ఫర్ లాఫర్ అనే నినాదంతో వారు ముందుకు వచ్చి ఈరోజున కైకలూరు కోవిడ్ సెంటర్కు 200 మెడిసిన్ కిట్స్, రెండు 10లీటర్లు, ఒక 7 లీటర్ల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ అందించిన సంస్థ ప్రతినిధి హనుమార పేరినీడు(పెదబాబు) గారికి ధన్యవాదాలు అన్నారు. అలాగే ఎందరో దాతలు స్పందించి సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారని, ముఖ్యంగా గ్రోవెల్ సంస్థ వారు ఇక్కడ 50 లక్షల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం తో పాటుగా మరో 50 లక్షలతో ఆసుపత్రికి కావలసిన ఇతర ఉపకరణాలు సమకూరుస్తున్నారని DNR అన్నారు.ఎందరో సహృదయ దాతలు వారందరికీ నియోజకవర్గ ప్రజల తరపున శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో లివ్ ఫర్ లాఫర్ హెల్ప్ ఇండియా బ్రీత్ సంస్థ ప్రతినిధి పెదబాబు,
కోవిడ్ సెంటర్ ఇంచార్జ్ డా.వేణుగోపాల్, CHC మెడికల్ సూపర్నెంట్ డా.ఆదిలక్ష్మి, కైకలూరు సర్పంచ్ DM నవరత్న కుమారి, ఎంపీపీ అభ్యర్థి అడివి వెంకట కృష్ణమోహన్, CHC ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు D శ్యామ్ కుమార్, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు షేక్ రఫీ, పీఈసిహెచ్ విద్యాసాగర్, పెయ్యేరు ఎంపీటీసీ అభ్యర్థి కోటె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.