– ఇతర రైళ్లలోనూ పెంపు : రైల్వే బోర్డు చైర్మెన్ వికె.యాదవ్
– 1050 స్టేషన్లలో విమానాశ్రయాల తరహాలో ‘యూజర్ బాదుడు’
న్యూఢిల్లీ : మన దేశంలో దశాబ్దాలుగా సాధారణ ప్రయా ణికుడికి అన్నివిధాలుగా అండగా ఉన్న రైలు ప్రయాణం ఇక మీదట భారం కానుంది. అన్ని రంగాలనూ ప్రయివేటు, కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్ కన్ను రైల్వే రంగంపై కూడా పడింది. భారత ప్రభుత్వ రైల్వేను ప్రయివేటుపరం చేసే చర్యల్లో భాగంగా పలు మార్గాల్లోని రైలు సర్వీసులను ప్రయివేటు కంపెనీలకు అప్పజెప్పనున్నది. ఆయా రైళ్లలో ప్యాసెంజర్ చార్జీలను నిర్ణయించే అధికారం ఆయా కంపెనీలకే కేంద్రం తాజాగా కట్టబెట్టింది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు చైర్మెన్ వికె.యాదవ్ మాట్లాడుతూ చార్జీలను తమ సొంతంగా నిర్ణయించే స్వేచ్ఛ ప్రయివే టు వ్యక్తులకు ఇచ్చామని పేర్కొన్నారు. ఆయా మార్గాల్లో ఏసీ బస్సులు, విమానాలు కూడా ఆపరేట్ అవుతా యనీ, చార్జీలను నిర్ణయించే ముందు ఈవిషయాన్ని దష్టిలో పెట్టుకోవాలని అన్నారు.
Courtesy: NT