– లైంగికదాడి ఆరోపణల్లో వివాదస్పద ఆధ్యాత్మిక గురువు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు..పలు కేసులతో పాటు లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ‘కైలాస’ను తన దేశంగా ప్రకటించుకున్న ఈ స్వామి ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు. 2020, ఆగస్టు 22న వినాయక చవితి రోజున సొంత కరెన్సీని ప్రారంభిస్తానని చెప్పినట్టుగానే కైలాస దేశానికి చెందిన నాణేలను సైతం విడుదల చేశారు. ఈ నాణేలు బంగారంతో చేసినవంటూ ఆయన చెప్పారు. కైలాస దేశం కరెన్సీ అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. ఓ దేశంతో చట్టబద్ధంగా ఎంవోయూ కుదుర్చుకున్నట్టు స్పష్టం చేస్తున్నారు. కానీ ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నారో ప్రకటించలేదు. రిజర్వ్ బ్యాంకు కోసం ఆర్థిక విధానం పేరిట 300 పేజీల నోట్ సిద్ధం చేసినట్టు, వాటికన్ బ్యాంకు తరహాలోనే నిర్మాణాత్మకంగా ఉంటుందన్నారు.
కైలాస అనేది నిత్యానంద పెట్టుకున్న దేశం పేరు. స్వయంగా తానే ప్రధాన మంత్రి అంటూ ప్రకటించుకున్నారు. భారతదేశంలో నమోదైన పలు కేసుల్లో ఇతను పారిపోయాడు. కానీ అతను ప్రకటించుకున్న దేశం ఎక్కడుందో తెలియదు. అయితే, ఈక్వెడార్ తీరంలో నిత్యానంద కొనుగోలు చేసిన ఓ ద్వీపంలో ఉన్నదని ప్రచారం జరుగుతోంది. అధికారిక వెబ్సైట్ కూడా రూపొందించారు.
ఇదిలా వుండగా, తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సిటీ కుమార్ వినూత్న ప్రయత్నం చేశారు. నిత్యానందకు చెందిన కైలాస దేశంలో తన హౌటల్స్ని ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని స్వామి నిత్యానందకు లేఖ రాశారు. నిత్యానంద అనుమతిస్తే కైలాస దేశంలో హెటళ్లను ప్రారంభించి భోజనం అందివ్వడమే కాకుండా దేశాభివద్ధికి దోహదపడతానని ఆయన లేఖలో వెల్లడించడం గమనార్హం.
Courtesy: NT