- సంపూర్ణ ఆహారాన్ని సూచించిన ఐసీఎంఆర్
- సెప్టెంబరంతా పౌష్టికాహార మాసోత్సవం
దిల్లీ: ఆకలిని తరిమేసి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పళ్లెంలో మన చుట్టూ అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) పోషకాహార విభాగం ప్రజలకు సూచించింది. సెప్టెంబర్ నెలను పౌష్టికాహార మాసోత్సవంగా జరుపుకోబోతున్న తరుణంలో ‘ఈ రోజు నా పళ్లెంలో..’ (‘మై ప్లేట్ ఫర్ ది డే’) పేరుతో ప్రజలు ఏ ఆహారాన్ని ఎంత మోతాదులతో తీసుకోవాలి, దానివల్ల రోజుకు ఎన్ని క్యాలరీల శక్తి వస్తుందన్న వివరాలు వెల్లడించింది. మనం తీసుకునే ఆహార పదార్థాలను మించిన పోషకాలను బయట లభించే విటమిన్, మినరల్ సప్లిమెంట్లు, ట్యాబ్లెట్లు, క్యాప్సూళ్లు, ఫోర్టిఫికేషన్లు ఇవ్వలేవని తెలిపింది. ఈ ఆహారం తింటే…
రోగ నిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను తట్టుకొనే సామర్థ్యం వృద్ధి చెందుతుంది.
మంచి మైక్రోబియల్ఫ్లోరా ఒకేస్థాయిలో ఉంటుంది. దీనివల్ల పేగుల్లోని మంచి బాక్టీరియాకు మేలు జరుగుతుంది.
తృణధాన్యాలతో మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
క్షారతను తగిన మోతాదులో ఉంచి మంటను తగ్గిస్తుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
ఇన్సులిన్ నిరోధకతను అరికట్టి, శరీరంలో తగినమోతాదులో ఇన్సులిన్ సున్నితత్వం, గ్లయిసెమిక్ ఉండేలా చూస్తుంది.
తగిన మోతాదులో పీచుపదార్థాలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.
పప్పుదినుసులకు బదులు గుడ్లు, చేపలు, మాంసం తీసుకోవచ్చు.
కూరగాయలను వండికానీ, సలాడ్స్రూపంలోకానీ స్వీకరించవచ్చు
రసాలకు బదులు తాజా పండ్లనే తీసుకోండి.
విభిన్నరకాల వంటనూనెలను వాడండి. ఎప్పుడూ ఒకే రకం నూనె వాడొద్దు.
ప్రతిపాదిత ఆహారం తీసుకోవడంవల్ల రోజుకు 2వేల కేలరీల శక్తి వస్తుంది.
పండ్లు, కూరగాయలను చెక్కు తీయక ముందే శుభ్రంగా కడగాలి.
రోజూ మన పళ్లెంలో ఉండేలా చూసుకోవాల్సిన పదార్థాలు ఇలా…
Courtesy Eenadu