కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద ముదినేపల్లి మండలంలోని ముదినేపల్లి గ్రామ సర్పంచ్ గా గెలిచిన నిమ్మగడ్డ కైకమ్మ కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ ముదినేపల్లి గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే ముదినేపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నిమ్మగడ్డ బిక్షాలు,గ్రామ పెద్దలు, ఈడే ఉమామహేశ్వరరావు, ఇంటేటి గాంధీ, పాము అభిలాష్, జొన్న రాంబాబు, కొల్లి గోపాలకృష్ణ, ఈడే శుభాషిణి, పామర్తి సతీష్, మేక భవాని యువకులు తదితరులు పాల్గొన్నారు.