- జనంలోకి ఒక్కరోజే రూ.35 కోట్లు
- రాత్రికి రాత్రే డబ్బు, మద్యం పంపిణీ
- హుజూర్నగర్లో ప్రలోభాల పర్వం
- ఉప ఎన్నిక పోలింగ్ నేడే
- 2,350 మంది పోలీసులతో భారీ బందోబస్తు
నల్లగొండ: హుజూర్నగర్ ఉప ఎన్నికలో నోట్లు కట్టలు తెంచుకున్నాయి. మద్యం ఏరులై పారింది. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు.. ఓటర్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారం ప్రారంభమైన నాటినుంచి ఒక ఎత్తయితే.. చివరి రెండు రోజులు ఒక ఎత్తు అన్నట్లుగా ఓటర్ల కొనుగోలుకు ప్రయత్నించాయి.
‘కల్లెపల్లి మైసమ్మ, దుప్పలపల్లి మైసమ్మ దేవతల వద్ద మొక్కి తెచ్చాం. డబ్బులు తీసుకున్న వారు మేం చెప్పిన గుర్తుకు ఓటువేయాలి. లేదంటే ఆ దేవతల ఆగ్రహానికి గురవుతారు’ అంటూ ఓటర్ల ఒత్తిడిపై తెస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా.. అటు ఎన్నికల కమిషన్ సిబ్బంది, ఇటు నిఘా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.
Courtesy Andhra jyothy