కాశ్మీరే కాదు.. సమాఖ్య స్ఫూర్తికీ తూట్లు…
– రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోడీ సర్కార్
న్యూఢిల్లీ : పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలు.. ఒక చట్టంతో జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దయింది. ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండగా, ఆ రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి లేకుండా ఏకపక్షంగా నిర్ణయం జరిగిపోయింది. ఈ చర్య సమాఖ్యపై దాడిగా పలు రాజకీయ పార్టీలు విమర్శలు సంధించాయి. ఆందోళనలకు దిగాయి. వామపక్షపార్టీలతో సహా కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం రాజ్యసభలో దీనిపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంటులో తనకున్న మెజార్టీని ఉపయోగించి రాష్ట్రాలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదనే భయాందోళనలకు ఈ చర్య మరింత ఊతమిచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జమ్మూకాశ్మీర్ను చీల్చటం సహా… పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రాల హక్కులను హరించే ధోరణిని ప్రస్ఫుటంచేస్తున్నాయి. కేంద్రం పలు బిల్లులను పార్లమెంటు ముందుకుతెచ్చింది. వాటిలో కొన్నింటిని పార్లమెంటరీ కమిటీలకు సూచించాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్నూ కేంద్రం పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు చేసిన ఈ డిమాండుకు ఒక కారణం ఉంది.
రాజ్యాంగం నిర్దేశించిన కేంద్రం, రాష్ట్రాల మధ్య సమాఖ్య సమతుల్యతను కేంద్రం దెబ్బతీస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. లోక్సభలో తనకున్న మెజారిటీని ఉపయోగించుకొని రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకు తన అధికారాలను మరింత పటిష్టంచేసుకోవాలనుకుంటున్నదనీ, అందుకే సభలో సరైన చర్చలు కూడా లేకుండా కేంద్రం చట్టాలను చేస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రతిపక్షాలు వివాదాస్పదమైనవిగా పేర్కొంటున్న, పార్లమెంటులో ఆమోదం పొందిన కొన్ని చట్టాలను ఒకసారి పరిశీలిస్తే..
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చట్టం
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చట్టానికి చేసిన సవరణలను లోక్సభ జులై 15న, రెండు రోజుల తరువాత రాజ్యసభ ఆమోదించింది. స్పష్టమైన ఉగ్ర కేసులే కాకుండా.. మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీకి సంబంధించిన నేరాలు, నిషేధిత ఆయుధాల తయారీ లేదా అమ్మకం, సైబర్-టెర్రరిజం, పేలుడు పదార్థాల చట్టం-1908 కింద నేరాలను దర్యాప్తు చేసే అధికారం కూడా ఈ ఏజెన్సీకి ఉంటుంది. చట్టం సవరణకు ముందు ఈ నేరాలు ఆయా రాష్ట్ర పోలీసుల పరిధిలోనివి. రెండవది, ఈ చట్టంలోని సెక్షన్-3కు చేసిన సవరణ ద్వారా.. దీని పరిధిలోకి తెచ్చిన నేరాల దర్యాప్తునకు సంబంధించి రాష్ట్ర పోలీసు అధికారులు కలిగి ఉన్న అన్ని అధికారాలు, విధులు, బాధ్యతలు ఎన్ఐఏకు కూడా ఉంటాయి, అంటే ఎన్ఏఐ రాష్ట్ర ఏజెన్సీల ద్వారా కాకుండా, నేరుగా రాష్ట్రాల్లో అరెస్టులు చేయవచ్చు.
పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలైన వామపక్షపార్టీలతో సహా కాంగ్రెస్, డీఎంకే ఈ బిల్లును వ్యతిరేకించాయి. మతపరమైన మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎన్ఐఏను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని ఆరోపించాయి. ఎన్ఐఏ పాత్రను విస్తరించడం ద్వారా… శాంతిభద్రతలను కాపాడే పేరుతో రాష్ట్ర అధికారాలను కేంద్రం హరిస్తున్నదనీ, ఇది సమాఖ్యవాద ప్రధాన సూత్రాలకు విరుద్ధమని వాదించాయి. అయితే, రెండు పార్టీలూ చివరకు జాతీయ భద్రత అంశాన్ని పేర్కొంటూ బిల్లుకు అనుకూలంగా ఓటువేశాయి. అయితే ఇతర పార్టీలు, సామాజిక కార్యకర్తల నుంచి కాంగ్రెస్, డీఎంకే విమర్శలను ఎదుర్కొన్నాయి.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం
ఎన్ఐఏ చట్ట సవరణ జరిగిన రెండు వారాలకు అంటే.. ఆగస్టు 2న చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్ట సవరణపై ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ సవరణల్లో ప్రధానమైనది.. వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనడానికి కేంద్రం అనుమతిస్తుంది – సవరణకు ముందు, సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి. అలాగే, ఉగ్రవాద అనుమానితుల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైన ముందస్తు అనుమతి లేకుండానే అటాచ్ చేయడానికి కేంద్ర ఏజెన్సీలకు అనుమతిస్తుంది.
ఎన్ఐఏ చట్టం సవరణల మాదిరిగానే, రాష్ట్ర అధికారాలను హరించే మార్పులను ప్రవేశపెట్టటాన్ని కేంద్రాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. నిందితుల ఆస్తులను జప్తు చేయటంలో ఆయా రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ల ఆమోదం కోరటంలో ఆలస్యమవుతుందనే ఈ నిబంధనలను తీసుకురావాల్సివ వచ్చిందని కేంద్రం తెలిపింది. బిల్లు ఆమోదం పొందింది.
ఆనకట్ట భద్రతా బిల్లు
జులై 29న లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు తమిళనాడు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీనిని యూపీఏ ప్రభుత్వం 2010 ఆగస్టులో మొదటిసారి ప్రవేశపెట్టింది. కాగా, దీని ముసాయిదాను స్టాండింగ్ కమిటీకి పంపాల్సి వచ్చింది. ఏడాది తర్వాత.. కమిటీ ప్రతిపాదించిన కొన్ని మార్పులను చేర్చి లోక్సభలో ఆమోదానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాలూ విఫలమయ్యాయి.రాజ్యాంగం ప్రకారం.. నీరు రాష్ట్ర జాబితా పరిధిలోనిది. అంతర్రాష్ట్ర నదులకు సంబంధించిన కొన్ని విషయాల్లో మాత్రమే కేంద్రం పాత్ర ఉంటుంది. ఆనకట్టల భద్రతపై జాతీయ కమిటీని ఏర్పాటు చేసే పేరుతో రాష్ట్రాలకు ప్రత్యేకమైన నీటిపై హక్కులను కేంద్రం హరించేందుకు ప్రయత్నిస్తున్నదన్నది ఈ బిల్లుపై వున్న ప్రాథమిక వివాదం. ప్రతిపాదిత చట్టం ప్రకారం ఒక రాష్ట్ర పరిధిలో నడుపు తున్న డ్యాం మరొక రాష్ట్ర భూభాగంలో ఉంటే, ఆ ఆనకట్టల భద్రతపై ఏర్పాటుచేసే జాతీయ కమిటీ ఆయా రాష్ట్రాల్లోని కమిటీల బాధ్యతలను కూడా నియం త్రిస్తుంది. అయితే, కేరళలోని వివాదాస్పద ముల్ల పెరియా ర్తో సహా తమిళ నాడు ఆధీనం లో వున్న ఐదు డ్యాములపై తమ నియంత్రణ కోల్పోతా మన్న భయాం దోళనను తమిళనాడు వ్యక్తంచేసింది.
సమాచార హక్కు (ఆర్టీఐ)
పార్లమెంటులో గత వారం ఆమోదించిన బిల్లుల్లో అత్యంత వివాదాస్పదమైనది సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) (సవరణ) బిల్లు-2019. ఈ సవరణల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లు, సమాచార కమిషనర్ల పదవీకాలం, వేతనంలో తీవ్ర మార్పులు చేశారు. సవరణలకు ముందు.. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిష నర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్లకు ఐదేండ్ల స్థిర పదవీ కాలం, లేదా వారికి 65 ఏండ్ల వచ్చేవరకూ పదవిలో ఉండేవారు. కానీ, ఈ పదవీకాలం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో వుంటుంది. ప్రధాన సమాచార కమిష నర్లకు మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషనర్లకు కూడా ఈ మార్పు వర్తిస్తుంది. కేంద్ర స్థాయిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కు సేవా నిబంధనలు, వేతనం ప్రధాన ఎన్నికల కమిషనర్తో సమా నంగా ఉండేది. రాష్ట్ర స్థాయిలోని వారికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో సమానం. దానిని ఇప్పుడు మార్చారు. వారి వేతనాలను కేంద్రమే నిర్దిశిస్తుంది. నియామక నిబంధనలను కూడా కేంద్రం నియం త్రిస్తు ంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులను కూడా కేంద్రం సులభంగా తొలగించే అవకాశం ఉంది. ఈ చట్ట సవరణలు సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తున్నది.ఈ సవర ణలను ప్రతిపక్ష పార్టీలైన వామపక్షపార్టీలతో సహా పలు
courtesy nava telangana