– క్షీణిస్తున్న శిశువుల జనన సంఖ్య
– 2030లో యూపీలో మరింత కిందకి..
– అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా భారత్లో ఇంకా ఆటవిక చర్యలకు చరమగీతం పాడలేకపోతున్నాం. ఆడపిల్లలను మహాలక్ష్మీతో పోల్చుతున్న దేశంలో ఇంకా మగబిడ్డలకై వెంపర్లడాతున్న కుటుంబాలున్నాయి. ఇంటికి వారసుడుకే అని ప్రాధాన్యతనివ్వడంతోనే ఆడపిల్లలను కడుపులోనే చిదిమేస్తున్నారు. దీంతో ఆడపిల్లల జనన సంఖ్య పాతాళానికి పడిపో తోంది. 2030 నాటికి సెక్స్ సెలక్టివ్ అబార్షన్లు (ఆడపిల్ల, మగపిల్ల అని నిర్ధారించుకున్న తర్వాత అబార్షన్ చేయించుకోవడం) వల్ల 68లక్షల మంది (6.8 మిలియన్ల) కన్నా తక్కువగా ఆడ పిల్లల జన్మిస్తారని సౌదీ అరేబియాకు చెందిన కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(కేఏయూఎస్టీ), ఫ్రాన్స్లోని యూనివర్సిటీ డే పారిస్ చేపట్టిన అధ్యయనంలో తేలినట్టు ‘ప్లోస్ వన్’ వార్తాపత్రిక ప్రచురించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఆడపిల్లల పుట్టుక రేటు తక్కువ ఉండనున్నదని అంచనా వేసింది. భారత్లో 1970ల నుంచి మగ బిడ్డలను కనేందుకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో లింగ జనన నిష్పత్తిలో(ఎస్ఆర్బీ) వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. ఇటువంటి అసమత్యులతలు ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ..అది సాధారణమైనదనీ, కానీ భారత్లో పరిస్థితులు ప్రత్యేకతతో కూడుకున్నవని అధ్యయనం పేర్కొంది. ఇక్కడ లింగ జనన నిష్పత్తి మునుపటి అంచనా జాతీయ స్థాయిలో నిర్మితమయ్యాయి. 2011 నాటి మొత్తం జనాభాలోని 98.4 శాతాన్ని కవర్ చేస్తూ..29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీ)సర్వే చేస్తూ ఎస్ఆర్బీని అంచనా వేశారు. అధికంగా జననాలున్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో…17 రాష్ట్రాలు, యుటిలు ఎస్ఆర్బీల్లో కుమారుడ్ని జన్మించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్టు తేలింది.
ఈ ఎస్ఆర్బీల్లో కూడా ఎక్కువ వాయవ్య రాష్ట్రాలు ఆసక్తిని కనబరుస్తున్నాయని పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా తొమ్మిది రాష్ట్రాలు లేదా యూటీలు కుమారుడిని కనేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు బృందం గుర్తించింది. 1994లో జననానికి ముందు లింగ నిర్ధారణ పరీక్షలపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ ఇంకా పుట్టుకకు ముందే ఆడశిశువుల మరణాలు సంభవించడం విచారకరం.
‘ 2017 నుంచి 2030 వరకు ఆడపిల్లల జనన రేటు ఉత్తరప్రదేశ్లో తక్కువగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నాం’ అని పరిశోధకులు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ సమయంలోనే 6.8 మిలియన్ల ఆడపిల్లల జననాల లోటు ఉండవచ్చునని పేర్కొన్నారు. 2017 నుంచి 2015 మధ్య అబార్షన్ల వల్ల ఏడాదికి 4,69,000 వేల ఆడశిశువులు కండ్లు తెరవకుండానే కనుమూస్తారని అంచనా వేశారు. 2016 నుంచి 2030 నాటి వారి సంఖ్య 5,19, 000లుగా ఉండవచ్చుని అంటున్నారు.
Courtesy Nava telangana