మరాఠ్వాడ దళితుల భూ పోరాటం
భారతదేశంలోని 60 శాతం దళిత కుటుంబాలకు స్వంత భూమి లేదు.2011 జనాభా లెక్కల ప్రకారం 70 శాతం మంది దళితులు వ్యవసాయ కార్మికులుగా పని చేస్తున్నారు. దళితులకు భూమిని పంచాలని లేకుంటే వారే ఆక్రమించుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. 91లో బాబాసాహెబ్ స్ఫూర్తితో లక్ష హెక్టార్ల భూమిని మహారాష్ట్ర marathwada ప్రాంతంలో దళితులు ఆక్రమించుకున్నారు. వీటిలో అధిక భాగం నేటికీ దళితుల స్వాధీనం లోకి రాలేదు. అంటే ప్రభుత్వ పట్టాలు వంటివి అందలేదు. పోరంబోకు భూముల్ని దళితులు ఆక్రమిస్తే వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. ఆచరణలో మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వాలు తను ఇచ్చిన ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయటం లేదు. మహారాష్ట్రలో భూ పరిమితి చట్టం ప్రకారం 2001 నాటికి మిగులుభూమిగా తేలిన దానిలో కేవలం రెండు శాతాన్ని మాత్రమే పంపిణీ చేసింది. ఇది దేశంలోనే అతి తక్కువ.2011 సామాజిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల 54వేల భూమిలేని దళితుల కుటుంబాలలో కేవలం 5శాతానికి మాత్రమే ప్రభుత్వం భూమిని పంపిణీ చేసింది. ఒక పక్క భూమి పంపిణీ చేయకపోవడం మరోపక్క ఇచ్చిన భూమిని లబ్ధిదారులకు స్వాధీనం చేయకపోవటం పరిపాటి అయ్యింది. భూస్వాముల హస్తాల్లో ప్రభుత్వం నేటికీ చిక్కుకొని ఉంది. ఇటీవల సంవత్సరాల్లో మహారాష్ట్ర దళితులు ప్రభుత్వ ఈ ధోరణికి వ్యతిరేకంగా తమ హక్కులకై ఆందోళనలు జెస్తున్నారు.