– ప్రణయ్ కుటుంబానిది హిందూ మతమే
– కేసును పక్కదోవ పట్టించేందుకు మారుతీరావు ప్రయత్నాలు : విలేకర్ల సమావేశంలో అమృత
– మిర్యాలగూడ
‘ఇకనైనా మమ్ముల్ని ఇలా బతకనివ్వండి’ అని తన తండ్రి మారుతిరావునుద్దేశించి ప్రణరు భార్య అమృత వేడుకుంది. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తన నివాసంలో ప్రణరు తండ్రి బాలస్వామి, ప్రజా సంఘాలు, దళిత, అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. హత్య అనంతరం ప్రణరు క్రిస్టియన్ అయినందున ఎస్సీ కమ్యూనిటీ ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలని కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయంలో దళిత సేవా రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వరప్రసాద్ ఫిర్యాదు చేసినట్టు తెలిసిందన్నారు. అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో ఏం చేయాలో తమకు బాగా తెలుసునని బెదిరింపులకు కూడా దిగినట్టు తమకు తెలిసిందన్నారు. మారుతీరావు ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే ఫిర్యాదులపై అధికారులు స్పందించి అన్ని కోణాల్లో విచారించి ప్రణరుది ఎస్సీ సామాజిక తరగతిగా నిర్ధారించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారని చెప్పారు.
పదే పదే మతం పేరుతో అట్రాసిటీ కేసును పక్కదోవ పట్టించేందుకు చౌకబారు ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. ప్రణరుది హిందూ మతం కాదని, తనను పెండ్లి చేసుకోవాలని ఒకతను పోస్ట్లో లెటర్ పంపడం లాంటి చీప్ట్రిక్స్ను మారుతీరావే నడిపిస్తున్నాడని ఆరోపించారు. ప్రణరు తాత, తండ్రులు ఎస్సీలేనని, తమ పెండ్లి కూడా ఆర్య సమాజ్లోనే జరిగిందని చెప్పారు. చనిపోయే ముందు రోజు కూడా తాము గణేష్ మండపంలో పూజలు నిర్వహించామన్నారు. తమకు న్యాయస్థానంపై నమ్మకముందని, కచ్చితంగా నిందితులకు శిక్ష పడుతుందని దీమా వ్యక్తం చేశారు.
సమావేశంలో సామాజిక కార్యకర్త డాక్టర్ రాజు, వివిధ సంఘాల నాయకులు తలకొప్పుల సైదులు, తమన్నా, మాడ్గుల శ్రీనివాస్, గూడపూరి శ్రీనివాస్, పెరుమాళ్ల జోజి, లింగమయ్య, రెమడాల పరుశురాములు, చిలుముల లకిëనర్సింహా పాల్గొన్నారు.
Courtesy Navatelangana…