కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని అయన నివాసం వద్ద కైకలూరు టౌన్ సర్పంచ్ శ్రీమతి D. M. నవరత్నకుమారి గారు అలాగే వార్డ్ మెంబెర్స్ కలసి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ముందుగా కైకలూరు పట్టణ ప్రజలందరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములు అని నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో కైకలూరు పట్టణ సర్పంచ్ శ్రీమతి D. M. నవరత్నకుమారి గారిని అత్యంత ఓట్ల మెజార్టీతో గెలిపించిన కైకలూరు పట్టణ ప్రజలకు పార్టీ ప్రముఖులకు నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు అలాగే రేపు రాబోయే 5 సంవత్సరాలు కైకలూరు పట్టణ ప్రజలకు సేవ చేయడానికి అవినీతి లేని పరిపాలన అందించడానికి సోదరి నవరత్నకుమారి ముందు ఉంటారు అని కైకలూరు పట్టణ అభివృద్ధికీ ప్రత్యేక కృషి చేస్తారు అని అన్నారు కైకలూరు పట్టణంలో ప్రతి పేదవాడికి అండగా వుంటూ కులమతాలకు పార్టీలకు అతీతంగా పరిపాలన అందిస్తాం అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి YS జగన్మోహనరెడ్డి గారి ఆశీస్సులతో కైకలూరు పట్టణంలో ఇప్పటికే 3200 మంది పేద అక్కచెల్లమ్మలకు ఇంటి పట్టాలు ఇచ్చాము అని YSR జగనన్న గ్రీన్ విల్లెజ్ లో పేద అక్కచెల్లమ్మలకు కావలసిన రోడ్డులు, డ్రైనేజీ, మంచినీరు, కరెంట్, పనులను కూడా త్వరలోనే మొదలుపెట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో UTF, PTTU, YSR టీచర్స్నా ఫెడరేషన్ APTF యూనియన్ వారు, నాయకులు అడవి కృష్ణ, మహ్మద్ జహీర్, రంగారావు, డేవిడ్ రాజు, భోగేశ్వరరావు, మహ్మద్ గాలిబ్, రామాంజనేయులు, బుజ్జిమ్మ, పాట్రిక్ పాల్, తదితరులు పాల్గొన్నారు.