సమాజంలో శాంతి భద్రతల నెలకొల్పడం కోసం అహరహం శ్రమించే పోలీస్ శాఖ వారి కార్యాలయానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రజా ప్రతినిధిగా తన విధి అని కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు.
ఈరోజు ఉదయం, కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్ నూతన ప్రహారీగోడ, నూతన టాయిలెట్స్ ను DSP సత్యానంద్ గారు, CI YVVL. నాయుడు, SI లు షణ్ముఖసాయి, రామకృష్ణ, గాయత్రి, చల్లా కృష్ణలతో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా MLA, DNR గారు ప్రహారీగోడ నిర్మాణానికి సహకారం అందించిన ఘంటసాల సురేష్, కన్న బాబు, దుర్గారావు గార్లని సన్మానించారు.
అలాగే DSP సత్యానంద్ గారిని, CI గారిని, SI లను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది అని గ్రామాలలో ఎటువంటి అరాచకాలు జరగకుండా పోలీస్ వారు కట్టుదిటమైన చర్యలు తీసుకుంటూ ప్రజలను కాపాడుతున్నారు అని ఇటువంటి పోలీస్ వారు వుండే పోలీస్ స్టేషన్ కు చుట్టూ ప్రహారీగోడ MLA నిధులు నుంచి 5 లక్షలు రూపాయలు, అలాగే దాతలు సహకారంతో నిర్మించి ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషం అని అన్నారు.
అలాగే కైకలూరు నియోజకవర్గంలో పోలీస్ వారికి ఎప్పుడు నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ D. M. నవరత్నకుమారి, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నిమ్మల సాయిబాబు, వడుపు ఏసుబాబు, పంజా నాగు, సతీష్, మదన్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.