కైకలూరు మండల ప్రజల ఆశీస్సులు వై.ఎస్.ఆర్.సీ.పీ కి మెండుగా ఉన్నాయని స్థానిక ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. భారీ మెజార్టీతో గెలుపొంది ఈ రోజు ఎంపీపీ ఎంపీటీసీ ల ప్రమాణ స్వీకార ర్యాలీలో ముఖ్య అతిధిగా MLA DNR గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కైకలూరు గ్రామ నాయకులు MLA, DNR గారి దంపతులకు గజమాల వేసి సన్మానించారు. అనంతరం పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా నాయకులు కార్యకర్తల మధ్య MLA గారి ఇంటి నుంచి జడ్పీటీసీ శ్రీమతి కురేళ్ళ బేబీ గారు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు కార్యకర్తలతో కలిసి, ఎంపీడీఓ ఆఫీస్ వరకు వెళ్లారు, అనంతరం ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిధిగా పాల్గొని, ఎంపీపీ అడవి కృష్ణ గారికి, ఎంపీటీసీ సభ్యులకు, అదేవిదంగా కో అప్షన్ సభ్యులు సోమల శ్యాంసుందర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA DNR గారు మాట్లాడుతూ కైకలూరు మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని 22 ఎంపీటీసీ స్థానాలకు 21 ఎంపీటీసీలు మన వాళ్ళు అత్యంత భారీ మెజార్టీతో గెలవటం చాలా సంతోషం అని అన్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అని నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ఆశీస్సులుతో గెలిచిన ప్రజాప్రతినిధులు అనునిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ రోజు కైకలూరు టౌన్ లో కైకలూరు మండల ఎంపీపీ అడవి కృష్ణ మోహన్ గారి ప్రమాణ స్వీకార ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు నోబుల్, సర్పంచ్ D. M. నవరత్నకుమారి, షేక్ రఫీ, సతీష్ కునవరపు, మదన్ కుమ్మరికుంట, విజయ్ వంగలపూడి, నిమ్మల సాయిబాబు, భాస్కర వెంకటేశ్వరరావు, నిమ్మల శ్రీను, కటికన రఘు, అబ్దుల్ హమీద్, రాంబాబు, జంపన కొండరాజు, రవి, మడక శ్రీను, వార్డ్ మెంబెర్స్, పెద్ద ఎత్తున నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.