మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆ దిశగా మొక్కలను పెంచి పోషించే వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసిన ఘనత మన జగనన్నదే అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా MGNREGA ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యాహ్నం మండవల్లి మండలం ప్రత్తిపాడులో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ క్రితం ప్రభుత్వంలా మొక్కలు నాటడం మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా.. బ్రతికిన మొక్కల లెక్కలు కాకిలెక్కలు చెప్పినట్టు కాకుండా ఈ ప్రభుత్వంలో దానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక మరియు ఆచరణ ఏర్పాటు చేస్తూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మొక్కల్ని పంపిణీ చేయడం జరుగుతుందని. ప్రస్తుత సామాజిక స్థితిలో ఆక్సిజన్ యొక్క ఆవశ్యకతను కరోనా మనకు తెలియజేసిన నేపథ్యంలో ఎక్కువ ఆక్సిజన్ ను నీడను ఇచ్చే మొక్కల్ని ఎంపిక చేసి నాటడం జరుగుతుందన్నారు. అదే విధంగా నాటిన మొక్కల్ని సంరక్షిస్తూ పెంచి పోషించడానికి ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ క్రింద పని కల్పించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోనే మొట్టమొదటి సారిగా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుటకు అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ వారికి, డ్వామా పీడీ గారికి ధన్యవాదాలని అన్నారు.
ఎంపిడివో శేషగిరిరావు మాట్లాడుతూ మండవల్లి మండలంలో ఈ జగనన్న పచ్చతోరణం కార్యక్రమం విజయవంతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎంపీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రాము మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి గారి హయాంలో లాగానే ఇప్పుడు కూడా పుష్కలంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. APO దేవానంద రాజు మాట్లాడుతూ MGNAREGA క్రింద అవెన్యూ ప్లాంటేషన్ క్రింద విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ల వెంబడి మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మండలానికి కేటాయించబడిన 5400 మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని అన్నారు.మండల వై.సి.పి కన్వీనర్ గుమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను విజయవంతం చెయ్యవలసిన బాధ్యత అధికారులపై, స్థానిక ప్రజలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేతపూడి రాజు, మండవల్లి PACS అధ్యక్షులు బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్, నాయకులు పెద్దిరెడ్డి శ్రీనివాస్, పెనుగొండ భాగ్యలక్ష్మి, అంద్రియ్య, యోహాన్, ప్రభుదాస్, జాన్, ఐజాక్, రత్నకుమారి, బాలమ్మ, ఒషీయా, బండి శ్రీనివాసరావు, విజయకుమార్, జీవరత్నం, పంచాయితీ కార్యదర్సులు, సెక్రటేరియట్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.