రాష్ట్రపతి ఉత్తర్వులు, జమ్మూ :-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మన ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను, రాజ్యాంగంలోని అసంఖ్యాక నిబంధనలను ఉల్లంఘిస్తుంది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ప్రజలు తామకు నచ్చినట్లు ఉండటం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనూ, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలోనూ కీలకమైంది.
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆ రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. భద్రత నుంచి సేవల వరకు అన్నింటా దీని ప్రభావం ఉంటుంది. బిల్లు ప్రకటన సమయంలో కనీసం వారి అభిప్రాయాలను కూడా తీసుకోలేదు. పైగా అక్కడ నిరసనలు వ్యక్తం అవుతాయనే ఉద్దేశంతో వేలాదిగా బలగాలను తరలించారు.
సాధారణంగా, రాజ్యాంగ సవరణ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియకు లోబడి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపుల ద్వారా ముసాయిదాను రూపొందించాలి. కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో దాన్ని ప్రవేశపెట్టాలి.
కొన్ని రోజులు ఆ బిల్లుపై చర్చ జరగాలి. ప్రజల్లో దానిపై విస్తృత చర్చ జరిగేలా పార్లమెంట్ సభ్యులు చూడాలి. ఆ తర్వాత బిల్లుపై ఓటింగ్ జరగాలి.
విషయంలో నిబంధనలు పాటించలేదు. వాస్తవానికి 370లోని రక్షణలు తొలగించాలంటే రాష్ట్రపతి మొదట కశ్మీర్ రాజ్యాంగ సభను సంప్రదించాలి. కానీ, 60 ఏళ్ల కిందటే ఆ సభ రద్దైంది.
ఈ సమయంలో రాష్ట్రపతి శాసన సభను సంప్రదించాలి. కానీ, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో శాసన సభ ఉనికిలో లేదు.
అయితే, శాసన సభ స్థానంలో గవర్నర్ ఉన్నారు కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయన చేయవచ్చు అని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, శాసన సభ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. గవర్నర్ను కేంద్రం నియమిస్తుంది. అందునా ఆయన కశ్మీరేతరుడు. జమ్మూ-కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు ఆయన ప్రతినిధి కాలేరు.
అదేవిధంగా, జమ్మూ-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు గురించి కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రకటన కూడా చేయలేదు. పార్లమెంట్ చర్చల పట్టికలోనూ అది లేదు. కొద్దిపాటి చర్చ తర్వాత లోక్ సభలో కాకుండా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.
వాస్తవానికి ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా బిల్లును ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉన్న సభ(లోక్ సభ)లో మొదట ప్రవేశ పెట్టాలి. కానీ, ఈ బిల్లు విషయంలో దీన్ని కూడా పాటించలేదు.
బిల్లును ప్రవేశపెట్టడానికి హోంమంత్రి ఇచ్చిన కారణాలు సహేతుకంగా లేవు. ఆర్టికల్ 370 అనేది యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కాదని ఆయన చెప్పారు.
కానీ, ఆర్టికల్ 370లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెసన్ ఆధారంగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్కు సంబంధించిన విషయాలు మినహా మిగిలిన అన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఉంది. ఈ నిబంధనలు తొలగిస్తే, దానిపై ప్రశ్నించలేమా?
కొందరైతే 370 నిబంధనను తొలగించలేదని అంటున్నారు. మరికొందరైతే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెసన్ ఆధారంగా ఈ రాజ్యంగ నిబంధనలు ఏర్పడినందువల్ల ఈ బిల్లు కారణంగా, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెసన్, రాజ్యాంగ నిబంధనలు రెండూ ఉల్లంఘనకు గురయ్యాయని అంటున్నారు.
మీడియాలోని చాలా మంది వ్యాఖ్యాతలు ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఈ రెండు బిల్లుల వల్ల 70 ఏళ్ల నుంచి వస్తున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయని, కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గి, ఆర్థిక ప్రగతి సాధ్యం అవుతుందని చెబుతున్నారు.
ఈ నిర్ణయం తర్వాత కశ్మీర్లో పెట్టుబడులు పెరుగుతాయని చెబుతున్నారు. కానీ, ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అస్థిరంగా ఉండే కశ్మీర్ను వదిలేయండి. శాంతియుతంగా ఉండే రాష్ట్రాలలోనూ భారత పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడరు.
ఆర్టికల్ 370ని నీరుగార్చేందుకు గత ప్రభుత్వాలు కూడా పనిచేశాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఇంత ధైర్యంతో కాకపోయినా గతంలోనూ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కేంద్ర, రాష్ట్ర సబంధాలపై ప్రభావం పడింది.
1990లో సాయుధ తిరుగుబాటుకు దారితీసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు 15 ఏళ్లు పట్టింది. మన దళాలు కశ్మీర్లోని ఉద్రిక్తతలను కొన్ని నెలలు అణచిపెట్టి ఉంచగలవు. కానీ, మనం ఎంతకాలం, ఎంత సైన్యాన్ని అక్కడ కేంద్రీకరించగలం?
కశ్మీర్లో రోజువారి పనులకు ఆటకం కలగకుండా భద్రతను సడలించి, రాష్ట్రానికి మరిన్ని అధికారులు ఇచ్చే విషయంపై అక్కడి అసమ్మతివాదులు, ప్రభుత్వానికి మధ్య 2000 నుంచి 2010 వరకు జరిగిన చర్చలు కశ్మీరీలలో ఆశలు కలిగించాయి.
దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు మీడియా చెప్పిందే నిజమని నమ్మూతూ మేం చెప్పే వాస్తవాలు అసత్యప్రచారంగా భావిస్తున్నారు. కానీ, ఈ బిల్లు వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు ఏమి కోరుకుంటున్నారనే దానిపై ఎవరికి ఎటువంటి ఆందోళన లేదు. మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, మేం ప్రజాస్వామ్య నిబంధనలు, ప్రాథమిక నియమాలను పక్కన పెట్టినట్లు బయటి ప్రపంచానికి కనిపిస్తున్నాం.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్కు మాత్రమే పరిమితమైన ప్రక్రియ అని మనం నిజంగా నమ్మగలమా? కచ్చితంగా కాదు.
నేను చెప్పింది తప్పని అంటే నాకు ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వ ప్రతినిధి ఈ ప్రశ్నలకు ఏ రీతిలోనూ స్పందించలేదు.
కానీ, ఈ విషయంలో నిబంధనలు పాటించలేదు. వాస్తవానికి 370లోని రక్షణలు తొలగించాలంటే రాష్ట్రపతి మొదట కశ్మీర్ రాజ్యాంగ సభను సంప్రదించాలి. కానీ, 60 ఏళ్ల కిందటే ఆ సభ రద్దైంది.
ఈ సమయంలో రాష్ట్రపతి శాసన సభను సంప్రదించాలి. కానీ, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో శాసన సభ ఉనికిలో లేదు.
అయితే, శాసన సభ స్థానంలో గవర్నర్ ఉన్నారు కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయన చేయవచ్చు అని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, శాసన సభ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. గవర్నర్ను కేంద్రం నియమిస్తుంది. అందునా ఆయన కశ్మీరేతరుడు. జమ్మూ-కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు ఆయన ప్రతినిధి కాలేరు.
అదేవిధంగా, జమ్మూ-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు గురించి కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రకటన కూడా చేయలేదు. పార్లమెంట్ చర్చల పట్టికలోనూ అది లేదు. కొద్దిపాటి చర్చ తర్వాత లోక్ సభలో కాకుండా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.
వాస్తవానికి ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా బిల్లును ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉన్న సభ(లోక్ సభ)లో మొదట ప్రవేశ పెట్టాలి. కానీ, ఈ బిల్లు విషయంలో దీన్ని కూడా పాటించలేదు.
బిల్లును ప్రవేశపెట్టడానికి హోంమంత్రి ఇచ్చిన కారణాలు సహేతుకంగా లేవు. ఆర్టికల్ 370 అనేది యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం కాదని ఆయన చెప్పారు.
కానీ, ఆర్టికల్ 370లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెసన్ ఆధారంగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్కు సంబంధించిన విషయాలు మినహా మిగిలిన అన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఉంది. ఈ నిబంధనలు తొలగిస్తే, దానిపై ప్రశ్నించలేమా?
కొందరైతే 370 నిబంధనను తొలగించలేదని అంటున్నారు. మరికొందరైతే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెసన్ ఆధారంగా ఈ రాజ్యంగ నిబంధనలు ఏర్పడినందువల్ల ఈ బిల్లు కారణంగా, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెసన్, రాజ్యాంగ నిబంధనలు రెండూ ఉల్లంఘనకు గురయ్యాయని అంటున్నారు.
మీడియాలోని చాలా మంది వ్యాఖ్యాతలు ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఈ రెండు బిల్లుల వల్ల 70 ఏళ్ల నుంచి వస్తున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయని, కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గి, ఆర్థిక ప్రగతి సాధ్యం అవుతుందని చెబుతున్నారు.
ఈ నిర్ణయం తర్వాత కశ్మీర్లో పెట్టుబడులు పెరుగుతాయని చెబుతున్నారు. కానీ, ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అస్థిరంగా ఉండే కశ్మీర్ను వదిలేయండి. శాంతియుతంగా ఉండే రాష్ట్రాలలోనూ భారత పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడరు.
ఆర్టికల్ 370ని నీరుగార్చేందుకు గత ప్రభుత్వాలు కూడా పనిచేశాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఇంత ధైర్యంతో కాకపోయినా గతంలోనూ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కేంద్ర, రాష్ట్ర సబంధాలపై ప్రభావం పడింది.
1990లో సాయుధ తిరుగుబాటుకు దారితీసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు 15 ఏళ్లు పట్టింది. మన దళాలు కశ్మీర్లోని ఉద్రిక్తతలను కొన్ని నెలలు అణచిపెట్టి ఉంచగలవు. కానీ, మనం ఎంతకాలం, ఎంత సైన్యాన్ని అక్కడ కేంద్రీకరించగలం?
కశ్మీర్లో రోజువారి పనులకు ఆటకం కలగకుండా భద్రతను సడలించి, రాష్ట్రానికి మరిన్ని అధికారులు ఇచ్చే విషయంపై అక్కడి అసమ్మతివాదులు, ప్రభుత్వానికి మధ్య 2000 నుంచి 2010 వరకు జరిగిన చర్చలు కశ్మీరీలలో ఆశలు కలిగించాయి.
దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు మీడియా చెప్పిందే నిజమని నమ్మూతూ మేం చెప్పే వాస్తవాలు అసత్యప్రచారంగా భావిస్తున్నారు. కానీ, ఈ బిల్లు వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు ఏమి కోరుకుంటున్నారనే దానిపై ఎవరికి ఎటువంటి ఆందోళన లేదు. మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, మేం ప్రజాస్వామ్య నిబంధనలు, ప్రాథమిక నియమాలను పక్కన పెట్టినట్లు బయటి ప్రపంచానికి కనిపిస్తున్నాం.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్కు మాత్రమే పరిమితమైన ప్రక్రియ అని మనం నిజంగా నమ్మగలమా? కచ్చితంగా కాదు.
నేను చెప్పింది తప్పని అంటే నాకు ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వ ప్రతినిధి ఈ ప్రశ్నలకు ఏ రీతిలోనూ స్పందించలేదు.
Courtesy BBC..