దేశంలో జైళ్ల తీరు ఇది… సిబ్బంది సంఖ్య అంతంతే.. ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, హైదరాబాద్ : భారతీయ జైళ్లన్నీ పరిమితికి మించి నిండిపోయాయని జాతీయ నేరాల నమోదు విభాగం (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలోని అన్ని జైళ్ల సామర్థ్యం 4.03 లక్షలు కాగా.. 2019లో 4.78 లక్షల మంది ఖైదీలు శిక్షలు అనుభవించారు. అదే సమయంలో.. జైళ్లలో 87,599 మంది సిబ్బందికి గాను.. 60,787 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిపింది. అధికారుల స్థాయిలోనూ సూపరింటెండెంట్ మొదలు డీజీ ర్యాంకులో 7,239 పోస్టులకు గాను.. 4,840 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం జైళ్ల సామర్థ్యాన్ని పెంచుతూ వస్తున్నా.. పరిమితికి మించి ఖైదీలు ఉంటున్నారని పేర్కొంది. 2017లో జైళ్ల సామర్థ్యం 3.91 లక్షలుగా ఉండగా.. 2018లో 3.96 లక్షలకు పెరిగింది. 2017లో మొత్తం జైళ్ల సంఖ్య 1,361గా ఉండగా.. 2018లో 22 జైళ్లు తగ్గి.. 1,339కు చేరుకున్నాయి. మళ్లీ 2019లో 11 జైళ్లు పెరిగి మొత్తం సంఖ్య 1,350గా ఉంది. ఖైదీల ఆక్యుపెన్సీ రేటు 115.1ు (2017), 117.6ు (2018), 118.5ు (2019)గా నమోదైంది.
మరిన్ని వివరాలు..
- 4.78లక్షల మంది ఖైదీల్లో.. 19,913 మంది మహిళలు.
- 1350 జైళ్లలో.. 617 సబ్-జైళ్లు, 410 జిల్లా జైళ్లు, 144 కేంద్ర కారాగారాలు, 86 ఓపెన్ ఎయిర్, 41 ప్రత్యేక, 31 మహిళా జైళ్లు, 31 బోస్టన్ స్కూళ్లు ఉన్నాయి
- సెంట్రల్ జైళ్లలో 1.77 లక్షల మంది, జిల్లా జైళ్లలో 1.58 లక్షల మంది, సబ్-జైళ్లలో 45,071 మంది ఖైదీలు శిక్ష అనుభవించారు.
- జిల్లా జైళ్లలో అత్యధికంగా 129.7ు మేర ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. సెంట్రల్ జైళ్లలో 123.9ు ఆక్యుపెన్సీ.. సబ్-జైళ్లలో అతి తక్కువగా 84.4ు, మహిళా జైళ్లలో 56.1ు మేర ఆక్యుపెన్సీ నమోదైంది.
- అన్ని జైళ్లలో 3,320 వైద్య సిబ్బంది పోస్టులు ఉండగా.. కేవలం 1,962 మంది పనిచేస్తున్నారు.
తెలంగాణలో సెంట్రల్ జైళ్లు ఫుల్?
- తెలంగాణలో సెంట్రల్ జైళ్లు నిండిపోయాయి. రాష్ట్రంలోని చంచల్గూడ, చర్లపల్లి, వరంగల్ కేంద్ర కారాగారాల్లో 99.86ు మంది ఖైదీలున్నారు. సబ్జైళ్లు 86.3ు మేర నిండిపోయాయి.
- రాష్ట్రంలోని 37 జైళ్లలో 7785 మంది సామర్థ్యం ఉండ గా.. 2019 డిసెంబరు 31 నాటికి 6,717 మంది ఉన్నారు
- జైళ్లలోని కర్మాగారాల్లో తెలంగాణ టాప్గా నిలిచింది. గత ఏడాది తెలంగాణ జైళ్ల పరిశ్రమలు రూ. 600 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. రెండో స్థానంలో తమిళనాడు (రూ. 73కోట్లు) ఉంది
- రాష్ట్రంలోని జైళ్లలో 75 మంది విదేశీ ఖైదీలున్నారు. వారిలో 10 మంది శిక్షపడ్డ వారు కాగా.. 65 మంది అండర్ ట్రయలర్స్
Courtesy Andhrajyothi