70 డిస్పెన్సరీల్లోని లావాదేవీలపై అనిశా దృష్టి ఈ కేసులో దేవికారాణిసహా ఆయిదుగురి సస్పెన్షన్ డైరెక్టర్గా అహ్మద్ నదీమ్కు బాధ్యతలు వైద్య సేవలు(ఐఎంఎస్) కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ యంత్రాంగం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విభాగంలో అడ్డగోలు దోపిడీ వెలుగు చూసిన నాటి నుంచి కోయికో తరహాలో ఆక్రమాలు బయట పడుతుండటంతో నిశితంగా పరిశీలిస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా బోరబండ, పటాన్ చెరు, బొంతపల్లి, ఏడీఏ బొల్లారం డిస్పెన్సరీల్లో అక్రమ లావాదేవీల పై దృష్టి సారించడంతో రూ.8 కోట్లకు పైగా దోపిడీ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏఎంఎస్ సంచాలకురాలు డాక్టర్ నీహెచ్ దేవికారాణి సహా ఆయిదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె స్థానంలో కార్మిక శాఖ కమిషనర్ అహ్మదానదీమకు బాధ్యతలు అప్పగిస్తూ కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి శశాంకియల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఎంఎస్ మందుల కుంభకోణంలో భాగంగా చేపట్టిన దర్యాప్తులో కీలక వ్యక్తి ఓమ్నీ మెడి సంస్థ ప్రతినిధి సీహెచ్ నాగరాజు ఇంట్లో రూ.46 కోట్ల విలువైన కొనుగోలు ఉత్తర్వులు లభించాయి. ఆ మొత్తాన్ని కాజేసేందుకు అక్రమార్కుల ముఠా పన్నిన పన్నాగం విజిలెన్స్, అనిశా అధికారులను నివ్వెరపోయేలా | చేశాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎస్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 ఆసుపత్రులు, 10 డిస్పెన్సరీలు, 2 – డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎంతమేరకు దోపిడీ జరిగిందని ఆరా తీసే పనిలో వారు తలమునకలయ్యారు. – గడిచిన అయిదేళ్లలో ఐఎంఎస్ కు ఏటా రూ.150-200 కోట్ల నిధులు సమకూరినట్లు అధికారులు ప్రాథమిక – అంచనాకు వచ్చారు. అలా సమకూరిన సుమారు రూ.వెయ్యి కోట్లలో ఎంత మేరకు ఈ ముఠా దారి మళ్లించిందనే దానిపై ప్రాధాన్యం సంతరించుకొంది. దీంతో మొత్తం డిస్పెన్సరీలలో కొన్నింటిని ఎంపిక చేసుకొని ఆర్థిక లావాదేవీలను పరిశీలించే పనిలో పడ్డారు. అన్ని లెక్కలు పూర్తయిన తర్వాతే మొత్తం దోపిడీపై స్పష్టత వచ్చే అవకాశముందని దర్యాప్తు బృందంలోని ఓ అధికారి పేర్కొన్నారు. ఐఎంఎస్
సంచాలకురాలు డా.దేవికారాణి, సంయుక్త సంచాలకురాలు డా.పద్మ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య విబేధాలున్నప్పటికీ అక్రమంగా కొల్లగొట్టేందుకు జతకట్టారు. వీరు ఓమ్నీ మెడి సంస్థ ప్రతినిధులతో ఎలా కుమ్మక్కయ్యారు? ఈ కుంభకోణంలో క్షేత్రస్థాయి ఉద్యోగుల ప్రాత ఎంత? ఇంకా ఎవరైనా ఉన్నతాధికారులెవరికైనా ప్రమేయం ఉందా? అక్రమార్కుల బినామీలెవరు? అనే అంశాలను తేల్చే పనిలో అనిశా నిమగ్నమైంది.
సెప్టెంబరు 27 నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమలు ఐఎంఎస్ మందుల కుంభకోణంలో అయిదుగురు నిందితులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఏఎంఎస్ సంచాలకురాలు డాక్టర్ సీహెచ్ దేవికారాణి సహా పలువురిని సస్పెండ్ చేస్తూ కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి శంశాంకగోయల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా సంయుక్త సంచాలకురాలు డాక్టర్ కె.పద్మ, సహాయ సంచాలకురాలు డాక్టర్ కె.వసంత ఇందిర ఫార్మాసిస్ట్ ఎం.రాధిక, సీనియర్ అసిస్టెంట్ వి.హర్షవర్ధన్ ను సస్పెండ్ చేశారు. సెప్టెంబరు 27 నుంచి ఈఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.
Courtesy Eenadu..