కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని గుమ్మళ్లపాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన సైదు వెంకటేశ్వరరావు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ గుమ్మళ్లపాడు గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు, అలాగే గుమ్మళ్లపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సైదు గాయత్రి, కురేళ్ళ బేబీ, ముంగర నరసింహ, బలే సత్యనారాయణ, బలే వెంకటేశ్వరరావు, ఘంటసాల రాంబాబు, సైదు ఏడుకొండలు, సైదు నరసయ్య, సైదు కుమారి, నాగరాజు, బాపూజీ, రాజు యువకులు తదితరులు పాల్గొన్నారు.