ఈరోజు గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన గుడివాడ డివిజన్ స్థాయి హౌసింగ్ సమీక్షా సమావేశంలో కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో నవరత్నాలు పేదలందరికి ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా వేయబడిన లే అవుట్ లలో మట్టి పూడిక పనులు, అప్రోచ్ రోడ్లు, మంచినీటి సౌకర్యాల కల్పన మరియు విద్యుత్ సదుపాయ కల్పన వంటి విషయాలను జిల్లా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డా.మాధవీలత, జిల్లా జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ సమీక్షించగా ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్న పూడికలకు యుద్ధప్రాతిపదికన మంజూరులు ఇచ్చి సహకరించ వలసినదిగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు(నాని), పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, హౌసింగ్ పి.డి రామచంద్ర మూర్తి, నరేగా పీడీ గోర్జి సూర్యనారాయణ, డివిజన్ హౌసింగ్ ఈ ఈ, ఎలక్ట్రికల్ ఈఈ, ఆర్ డబ్ల్యు ఎస్ ఈ ఈ, డివిజన్ లోని అందరు హౌసింగ్ డి.ఈ.ఈ లు, ఏ ఈ లు, ఎంపిడివోలు, తహసీల్దార్ లు, డ్వామా ఎపిఓ లు, వెలుగు ఎపిఎం లు తదితరులు పాల్గొన్నారు.