ఉత్తర ప్రదేశ్, బులంద్షహర్లో తనకు ఒక దళిత యువతి లొంగలేదని ఆగ్రహించి అగ్రవర్ణాలకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఆమె కుటుంబంలోని ఇద్దర్ని బలికొన్నాడు.
సోమవారం రాత్రి 22 సంవత్సరాల దళిత యువతిని ఒక యువకుడు కారు ఎక్కమని తన కోరిక తీర్చమని అడిగాడు. దానికి ఆమె తిరస్కరించింది. ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు ఆమె కుటుంబ సభ్యుల్ని వేగంగా కారుతో ఢీ కొట్టి ఇద్దర్ని చంపివేశాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాకు చిక్కింది. బాధిత యువతి జరిగిన వివరాలని చెప్పగా కొందరు సెల్ ఫోన్ లో వీడియోగా చిత్రీకరించారు. ఎన్డి టీవీ ప్రసారం చేస్తున్న ఈ వార్త వివరాలు చూస్తే అందర్నీ కలచివేస్తున్నది. అధికారులు మాత్రం నేటికీ మమా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. పకడ్బందీ కేసు నమోదు, నేరస్తుడు అరెస్టు ఇంతవరకు జరగలేదు.