గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన కొల్లేరు చుట్టు పక్కల గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి, జాన్ పేట గ్రామ వరద ముంపుకు గురయిన నిర్వాసితులకు నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ వున్నత పాఠశాల నందు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జాన్ పేట గ్రామ నిర్వాసితులకు కైకలూరు పెద్ది ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ తరపున MLA DNR గారి ఆదేశాల మేరకు ఒక్కరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
ఆటపాక EO రామలక్ష్మి, సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న,
కన్నా రమేష్, పెద్ది గ్రూప్ అడ్మిన్ పెద్దిరాజు ముక్కెళ్ల
జాన్ పేట యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదన్ కుమార్ కుమ్మరికుంట, సెక్రటరీ విజయ్ కుమార్ వంగలపూడి, మార్కెట్ యార్డు డైరెక్టర్ సతీష్ కుమార్ కూనవరపు, జాన్ పేట గ్రామ వాలంటీర్లు, ఆటపాక పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.