గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన కొల్లేరు చుట్టు పక్కల గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి, జాన్ పేట గ్రామంలో రెండు అడుగులు పైగా నిలిచిన నీరు పూర్తిగా మురిగిపోయి దుర్వాసన వస్తున్నాయి. వరద నీరు పూర్తిగా తగ్గే వరకు ఎవరు కూడా ముంపు ప్రాంతాల్లో నివసించడానికి అవకాశం లేదు, అంటువ్యాధులు ప్రభలే అవకాశం వుంది కాబట్టి గత కొన్ని రోజులుగా జాన్ పేట గ్రామ వరద ముంపుకు గురయిన నిర్వాసితులకు నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ వున్నత పాఠశాల (హై స్కూల్) నందు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది.
జాన్ పేట గ్రామ నిర్వాసితులకు జాన్ పేట యూత్ అసోసియేషన్ ద్వారా రెవిన్యూ మరియు దాతల సహకారంతో’ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి భోజనాలు, వసతి, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు ఫుడ్ డొనేషన్ కాంపెయిన్ టౌన్ SI గాయత్రి గారి చేతుల మీదుగా ప్రారంబించడం జరిగింది. ఈ కార్యక్రమాలను మన MLA దూలం నాగేశ్వరరావు, MPP అభ్యర్ధి అడవి కృష్ణ, నిమ్మల సాయి, MRO సాయి కృష్ణ కుమారి, RI వరప్రసాద్, రెవిన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా: ముంపుకు గురయ్యి ఇంకా శిబిరానికి చేరుకోని వారు రాబోయే రోజుల్లో మురుగు నీరు వలన అంటువ్యాధులకు గురవకుండా ముందుగానే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని, ఈ శిబిరంలో మెడికల్ క్యాంపు, ఆహార సదుపాయం, మినరల్ వాటర్ సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నామని నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని జాన్ పేట యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదన్ కుమ్మరికుంట, వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సతీష్ కుమార్ కునవరపు, సెక్రటరీ విజయ్ కుమార్ వంగలపూడి గార్లు తెలియచేశారు.
ఫుడ్ డొనేషన్ లైవ్ వీడియో