చంపాపేట/చాదర్ఘాట్, ఆగస్టు 23 : శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుతుత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన జెన్కో డీఈ బత్తిని శ్రీనివా్సగౌడ్, ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాలను శనివారం వారి నివాసానికి వెళ్లి హోంమంత్రి పరామర్శించారు. శ్రీనివాస్ కుటుంబానికి సీఎం కేసీఆర్ 50లక్షల పరిహారం, ఫాతిమా కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. కాగా, ఫాతిమా కుటుంబసభ్యులను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా పరామర్శించారు.