- ఎస్బ్యాంక్ మాజీ చీఫ్కు
- రాజీవ్ చిత్రపటం విక్రయంపై దర్యాప్తు
- చిత్రపటం ఆమెదా? కాంగ్రె్సదా?
- సర్టిఫికెట్పై ఆమె సంతకం చేశారా?
- వాల్యుయేషన్ లేకుండా ఎలా అమ్మారు
- నిగ్గుతేల్చాలని ఈడీ నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 3: ఎస్బ్యాంక్ మాజీ చీఫ్ రాణా కపూర్ మనీలాండరింగ్ వ్యవహారాలపై తీగలాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందులో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాపైనా దృష్టి సారించింది. విదేశాల్లో స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు, మనీలాండరింగ్పై భర్త రాబర్ట్ వాద్రాను నిశితంగా ప్రశ్నించిన ఈడీ ఇపుడు ఆమె పదేళ్ల కిందట సాగించిన ఓ విక్రయ వ్యవహారాన్ని తవ్వి తీయనుంది. రాణా కపూర్ 2010లో రాజీవ్గాంధీ చిత్రపటాన్నొకదాన్ని ప్రియాంక నుంచి ఏకంగా రూ.2 కోట్లకు కొన్నారు.
ముంబై కాంగ్రెస్ నేత మిళింద్ దేవరా సూచన మేరకు నేరుగా ప్రియాంకను సంప్రదించి దాన్ని కొన్నారు. రాణా కపూర్ దగ్గర ఉన్న 44 ఖరీదైన పెయింటింగ్ల్లో అదీ ఒకటి. ఆ పెయింటింగ్ను సుప్రసిద్ధ ఆర్టిస్ట్ ఎంఎఫ్ హుస్సేన్ వేసి 1985లో ఏఐసీసీ ప్లీనరీ సమయంలో రాజీవ్కు బహూకరించారు. దాన్నే రాణా కపూర్కు ప్రియాంక అమ్మేశారు. అమ్మిన దానికి రసీదును ఇచ్చారు. చెక్ ద్వారా సొమ్ముతీసుకున్నారు. ఈ లావాదేవీ విషయాన్ని ప్రియాంక తన ఐటీ రిటర్న్స్లో కూడా చూపినట్లు కాంగ్రెస్ అంటోంది. ఈడీ ఇపుడు దీన్ని శోధించనుంది. అసలు ఆ చిత్రపటం కాంగ్రెస్ పార్టీదా? లేక ప్రియాంక సొంతమా? అది అంత విలువ చేస్తుందా? మొదలైన వివరాలను ఈడీ బయటకు తీయనుంది. ఇప్పటికే ఈడీ అభిప్రాయాలను కాంగ్రెస్ కొట్టిపారేసింది.
Courtesy Andhrajyothi