- ప్రపంచంలో భారత్ ర్యాంక్ 14
- సులభతర వాణిజ్యంలో మూడో స్థానానికి తెలంగాణ
- వరుసగా మూడో ఏటా ఏపీనే టాప్
- యూపీ రెండో స్థానం.. సంస్కరణల ఆధారంగా ర్యాంకులు
- 2018-19 బిజినెస్ యాక్షన్ ప్లాన్ ర్యాంక్లకు ప్రాతిపదిక
- ర్యాంకులు విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
- ఈ సారి ర్యాంకుల మదింపులో పలు మార్పులు
- రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ.. నిర్మల ప్రశంస
- వెనకబడ్డ రాష్ట్రాలకు ఇదో హెచ్చరిక: పీయూష్
న్యూఢిల్లీ : సులభతర వాణిజ్యంలో(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -ఈఓడీబీ) విభాగంలో ఈసారి తెలంగాణ ర్యాంకు తగ్గింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో రాష్ట్రానికి మూడో స్థానం దక్కింది. 2018లో రాష్ట్రం రెండో ర్యాంకులో ఉండేది. ఆంధ్రప్రదేశ్ మాత్రం వరుసగా మూడోసారి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్సలో మొదటిస్థానాన్ని నిలబెట్టుకుంది. గతంలో 12 స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఈసారి అనూహ్యంగా రెండో స్థానాన్ని ఆక్రమించడం విశేషం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ రూపొందించిన 2019 సంవత్సరపు ర్యాంకులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం విడుదల చేశారు. ర్యాంకుల నిర్ణయంలో మొత్తం 180 పాయింట్లను పరిగణలోకి తీసుకున్నారు. మెరుగైన కార్మిక చట్టాల అమలు, నిర్మాణాలకు
వెంటనే అనుమతి ఇవ్వడం, భూ పరిపాలన, సింగిల్విండో అప్రూవల్స్, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వం అందించే సేవలను డిజిటలైజ్ చేయడం లాంటి సంస్కరణల అమలు తీరు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పాయింట్లను కేటాయించారు. 2018-2019 సంవత్సరంలో రాష్ట్రాలు అమలు చేసిన సంస్కరణల మేరకు కేంద్రం తాజా ర్యాంకులను రిలీజ్ చేసింది. డీపీఐఐటీ ఈసారి ర్యాంకింగ్ విధానాన్ని మార్చేసింది. ఆయా రాష్ట్రాల పనితీరుతోపాటు 35వేల యూజర్ల ఫీడ్బ్యాక్లను కూడా పరిగణలోకి తీసుకుని ర్యాంకులను తయారుచేశారు. కరోనా నేపథ్యంలో కేంద్రం అమలుచేసిన ఆత్మ నిర్భర్ స్కీమ్ను కూడా ర్యాంకుల నిర్ణయంలో పరిగణలోనికి తీసుకున్నారు. ఉత్తర భారతం నుంచి యూపీ, దక్షిణాది నుంచి ఏపీ, తూర్పు నుంచి బెంగాల్, పశ్చిమ భారత్ నుంచి మఽధ్యప్రదేశ్, ఈశాన్య భారతం నుంచి అసోం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ అగ్రస్థానాల్లో నిలిచాయి. ర్యాంకు ల విడుదల సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి మా ట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడం ఆనందం గా ఉందన్నారు. తొలి మూడు ర్యాంకులను సాధించిన ఏపీ, యూపీ, తెలంగాణలను ఆమె అభినందించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్రాలకు తాజా ర్యాంకుల జాబితా ఒక హెచ్చరికలాంటిదన్నారు. ర్యాంకులు రాష్ట్రాల కృష్టికి ప్రతిబింబమని చెప్పారు. అనుమతులు, క్లియరెన్స్ల కోసం తమ మంత్రిత్వశాఖ సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి జిల్లా అందుబాటులో ఉన్న వనరుల మేరకు సొంత ఉత్పత్తులపైనే దృష్టిసారించాలని సూచించారు. డూయింగ్ బిజినెస్ తాజా రిపోర్టులో భారత్ స్థానం 63 నుంచి 14కి ఎగబాకిందన్నారు. ఈ ర్యాంకుల వల్ల ప్రపంచంలో దేశం స్థాయి మెరుగుపడుతుందని తెలిపా రు. కేంద్ర పట్టణాభివృద్ధి, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కూడా పాల్గొన్నారు.
టాప్ ర్యాంకు కోసం కసరత్తు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్సలో టాప్ ర్యాంకు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు తీవ్రంగానే చేసింది. పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టింది. పారిశ్రామిక అనుమతుల విషయంలో టీఎ్స-ఐపా్సను అమలు చేసి సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా పరిశ్రమలకు అనుమతులను మం జూరు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అడవులు, పరిశ్రమలు, విద్యుత్తు, జీఎ్సటీ విషయాల్లో సంస్కరణలు చేపట్టింది.
టాప్ 10 రాష్ట్రాలు ఇవే:
- ఆంధ్రప్రదేశ్
- ఉత్తరప్రదేశ్
- తెలంగాణ
- మధ్యప్రదేశ్
- ఝార్ఖండ్
- ఛత్తీస్గఢ్
- హిమాచల్ ప్రదేశ్
- రాజస్థాన్
- పశ్చిమ బెంగాల్
- గుజరాత్
పెట్టుబడులకు అనుకూలవాతావరణం
భారత్ పెట్టుబడులకు అనుకూలమైన దేశమని భావించే వారంతా పెట్టుబడులు పెడుతున్నారు. ఏప్రిల్- జూలై మధ్య మనదేశానికి 20 బిలియన డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) వచ్చాయి. లాక్డౌన్లోనూ ఇంతపెద్ద మొత్తంలో ఎఫ్డీఐలు రావడానికి మనదేశంలో అనుకూలమైన వాతావరణం ఉండడమే కారణం.
– కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్