కోల్కతా : దుర్గా పూజా ఫెస్టివల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో మార్క్సిస్టు సాహిత్యం అధికంగా అమ్ముడుపోతున్నది. సీపీఐ(ఎం) పబ్లిషింగ్ హౌజ్ ‘నేషనల్ బుక్ ఏజెన్సీ(ఎన్బీఏ)’ ఏర్పాటు చేసిన బుక్స్టాళ్లలో ఈ పుస్తకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. అలాగే పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య.. చైనాపై రాసిన పుస్తకానికి పుస్తక, సాహిత్యప్రియుల నుంచి చక్కని ఆదరణ లభిస్తున్నదని సీపీఐ(ఎం) తెలిపింది. ‘బుద్దదేవ్ చైనాపై రాసిన రెండు ఎడిషన్ల తాజా పుస్తకాలు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇప్పుడు మూడో ఎడిషన్ను ప్రింటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాం’ అని ఎన్బీఏ చైర్మెన్ అనిరుద్ద చక్రవర్తి తెలిపారు. ఈ ఏడాది దుర్గా పూజ ఫెస్టివల్లో భాగంగా 1100 బుక్స్టాళ్లను ఎన్బీఏ ఏర్పాటు చేసింది
Courtesy Navatelangana..