కొలువు ఆఫర్ చేసిన బెంగళూరు కంపెనీ
బెంగళూరు: మనలో చాలా మంది ఆఫీసుల్లో పని చేస్తూ ఆదమరిచి కునుకు తీస్తుంటారు. ఆ సమయంలో గనక బాస్ కంట పడ్డారంటే నిద్రమత్తు వదిలేలా తిట్లు తప్పవు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమకు ఇలాంటి వారే కావాలంటోంది. ‘‘రోజూ రాత్రి 9 గంటలు శుభ్రంగా పడుకోండి.. రూ. లక్ష జీతం ఇస్తాం’’ అని కొలువుకు పిలుస్తోంది. వేక్ఫిట్ అనే కంపెనీ స్లీప్ ఇంటర్న్షి్పతో ముందుకు వచ్చింది. ఇందులో పాల్గొనే వారు బాగా నిద్రపోయేలా స్లీప్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, ఫిట్నెస్ నిపుణులు పలు సూచనలు చేస్తారు. అభ్యర్థులందరినీ ఒక ప్రత్యేక వాతావరణంలో ఉంచి.. వారందరూ గాఢంగా, ఎక్కువ సేపు నిద్రపోయేలా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తారు. ఈ ఇంటర్న్షి్పలో పాల్గొనేవారికి ఏదైనా డిగ్రీ ఉండాలి. బెడ్పైకి వెళ్లగానే 10-20 నిమిషాల్లో నిద్రలోకి జారుకునే లక్షణం ఉండాలి. కునుకు తీయడం, బద్ధకం వంటివి అదనపు అర్హతలు. పోయినసారి ఈ ఇంటర్న్షిప్ కోసం 1.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 23 మందే ఎంపికయ్యారు. అందులో 21 మంది భారతీయులు కాగా, ఇద్దరు విదేశీయులు.