స్థానిక శ్యామలమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలను ప్రారంభిస్తున్న MLA దూలం నాగేశ్వరరావు గారు.
కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి దంపతులు, శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి శ్రీ దేవి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలను ప్రారంభించారు.
అనంతరం దాతల సహకారంతో నిర్మించిన యోగశాల, ఆలయంలో దక్షిణ, పడమర వైపు నిర్మించిన షెడ్లను ప్రారంభించారు, ఈ సందర్బంగా MLA దూలం నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ముందుగా కైకలూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ దేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ శ్యామలాంబ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు అని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి, వ్యక్తికత దూరం పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జంపన రామలింగరాజు, EO లక్ష్మినారాయణ, తెలగంశెట్టి శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ శ్రీ తెలగంశెట్టి శ్రీదేవి, రామలింగేశ్వరస్వామి ఆలయ చైర్మన్ శ్రీ ఉప్పులూరి ఉషా పద్మజ, కమిటీ సభ్యులు బురబోయిన మోహనరావు, బొర్రా దుర్గేశ్వరి, ఇంటి గంగమ్మ, కనుమూరి రమాదేవి, సాంబశివరావు, పైడిమరీ సుబ్బారావు, సీతామహాలక్ష్మీ నాయకులు జడ్పీటీసీ అభ్యర్థి, కూరెళ్ళ బేబీ, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ,షేక్ రఫీ, భాస్కర వెంకటేశ్వరరావు, జంపన కొండరాజు, నిమ్మల సాయిబాబు, కాటికన రఘు, మాస్టర్ శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
Kaikaluru MLA Sri Dulam Nageswararao garu at Syamalamma Temple, Kaikaluru.