కీసర: మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు శనివారం కీసర మండలం కేంద్రంలోని దళితవాడలో పర్యటించారు. దళితులకు చెందాల్సిన భూమిని ఇతర రియల్టర్లకు అనూకూలంగా రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. కీసర దాయర సర్వేనంబర్ 173, 174, 175, 176, 179, 213లకు సంబంధించి ఇంటింటికి తిరిగి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబాల ఇళ్లను చూసి హనుమంతరావు చలించిపోయారు. వారికి రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం దళితులకు న్యాయం చేయాలని మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.