మద్యం విధానాన్ని ప్రశ్నించిన వీడియో వైరల్
ఆపై మరణంపై అనుమానాలు
చిత్తూరు: మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓంప్రతాప్ (30) మృతి చెందారు. ప్రభుత్వాన్ని దూషించినట్లు ఉన్న వీడియో వైరల్ కావడం.. ఆ తరువాత ఆ యువకుడు మృతిచెందడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఆదెమ్మల పెద్దకుమారుడు ఓంప్రతాప్ మదనపల్లెలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల బసినికొండ సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లి మద్యం కొన్నాడు. పక్కనే ఉన్న వ్యక్తిని వీడియో తీయమన్నాడు. అందులో రూ.140లుగా ఉన్న బీరు బాటిల్ను రూ.240కు పెంచారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈనెల 24న స్వగ్రామంలో పొలం పనులకు వచ్చి మృతి చెందాడు. యువకుడి మృతిపై ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. ఓంప్రతాప్ మృతిపై కుటుంబీకులు మాట్లాడుతూ యువకుడికి కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం సరిగాలేదని చెప్పారు. ఈక్రమంలోనే మృతిచెందాడన్నారు.
Courtesy Eenadu