File Photo
తమిళనాడు మదురై జిల్లా valayapatti గ్రామ పాఠశాలకు దళిత విద్యార్థుల్ని రానీయటం లేదు.
ముదలియార్లు బీసీలు. ఏప్రిల్లో దళితుల్ని వీళ్లు దేవాలయానికి రానీకుండా అడ్డుకున్నారు. అప్పటినుంచి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉన్నది. గ్రామంలోని ముత్యాలమ్మ గుడి మేనేజ్మెంట్ బీసీలు చూస్తారు. పల్లెలో 200 కుటుంబాలు బి సి లవి , 30 కుటుంబాలు పల్లర్లు, 25 అరుంధతి యార్ కుటుంబాలు ఉన్నాయి. సంవత్సరాలుగా అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం ఉండేది. ఏప్రిల్లో గుడి ఉత్సవం సందర్భంగా దళితులు పాల్గొనరాదని బీసీలు అడ్డుచెప్పారు. దేవాలయ ఉత్సవం తర్వాత జల్లికట్టు జరుగుతుంది. ఈసారి అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు. ఇదే తరుణంలో దళితులు ఒక సినిమా హీరో పుట్టినరోజు పండుగ జరిపారు. ఇది బీసీలకు నచ్చలేదు. బీసీల తీరుకు నిరసనగా దళితులు తాము చేపట్టే వృత్తి పనులు నిలిపివేశారు. చావుల చాటింపు, మృతదేహాలను ఖననం వంటి పనుల్ని ఆపివేశారు. దీనికి ప్రతిఫలం దళితులసామాజిక బహిష్కరణ. దళిత అంగన్వాడీ వర్కర్ల సేవలపై కూడా ఆంక్షలు వచ్చాయి. ఇద్దరు అంగన్వాడీ వర్కర్ లను ట్రాన్స్ఫర్ చేయించారు. పాఠశాలలు తెరవగానే బడికెళ్లి అందరిలాగా చదువుకోవాలన్న దళిత పిల్లల ఆశలు నేడు అడియాసలయ్యాయి. స్థానిక అధికారులు చొరవ తీసుకొని సమస్యను ఆదిలోనే పరిష్కరించలేక పోయారని ఇప్పుడు కలెక్టర్ అంటున్నారు. ద్రవిడ ఉద్యమ సీమ తమిళనాడులో దళితుల పరిస్థితికి ఇదొక మచ్చుతునక.